వైఎస్ జగన్ సర్కార్కి మరో షాక్ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్కుమార్ని తొలగించేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి తీసుకొచ్చిన ఆర్డినెన్స్ని హైకోర్టు కొట్టివేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డిఎన్స్ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ క్షణం నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొనసాగుతారని న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మీడియాతో చెప్పారు. కాగా, స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలపై నిమ్మగడ్డ రమేష్కుమార్ సీరియస్గా వ్యవహరించిన విషయం విదితమే. పలువురు అధికారుల బదిలీలకు నిమ్మగడ్డ రమేష్కుమార్ ఎస్ఇసి హోదాలో ప్రభుత్వానికి సూచించారు.
మరోపక్క, కరోనా వైరస్ నేపథ్యంలో పరిస్థితి తీవ్రతను ముందుగానే అంచనా వేసిన రమేష్కుమార్, స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. ఈ పరిణామాల్ని జీర్ణించుకోలేకపోయిన అధికారపక్షం, నిమ్మగడ్డ రమేష్కుమార్పై ‘కులం’ ముద్ర వేసింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, నిమ్మగడ్డ రమేష్కుమార్పై ‘కులం’ పేరుతో వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. సభాపతి తమ్మినేని సీతారాం సహా పలువురు వైసీపీ నేతలు, నిమ్మగడ్డ రమేష్కుమార్పై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ పరిణామాల నడుమ, నిమ్మగడ్డ రమేష్కుమార్ తనకు రాష్ట్రంలో భద్రత లేదంటూ కేంద్రానికి మొరపెట్టుకోవడం, కేంద్రం ప్రత్యేక భద్రతను కల్పించడం తెల్సిన విషయాలే. ఈ క్రమంలోనే నిమ్మగడ్డ రమేష్కుమార్ని తొలగించేలా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం, ‘స్థానిక ఎన్నికల సంస్కరణలు’ అంటూ కొత్త విధి విధానాల్ని తెరపైకి తెచ్చింది ఆర్డినెన్స్ ద్వారా.
ఈ ఆర్డినెన్స్ నేపథ్యంలోనే కనగరాజ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది కూడా. హైకోర్టు తీర్పుతో కనగరాజ్ స్థానంలో నిమ్మగడ్డ రమేష్కుమార్ తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరిస్తారా.? రాష్ట్ర ప్రభుత్వం తదుపరి వ్యూహం ఎలా వుండబోతోంది.? వేచి చూడాల్సిందే.
991171 724674Music started playing anytime I opened this web web site, so annoying! 804387
443828 432908I think this web site contains some very good info for everyone : D. 15032
618961 152901I actually prize your piece of function, Wonderful post. 602822