సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు అసహనంలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎప్పుడూ కూల్ గా ఉండే మహేష్, ఈ లాక్ డౌన్ సమయంలో కూడా కుటుంబ సభ్యులతో తన ఫ్రీ టైమ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అలాంటి మహేష్ కు అసహనం ఎందుకు అంటే.. అది తన తర్వాతి సినిమా విషయంలోనేనట. మహేష్ తన 27వ సినిమాను పరశురామ్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెల్సిందే. ఇదే విషయాన్ని దర్శకుడు ప్రకటించడంతో అధికారికమైంది. అయితే మొన్నటి దాకా ఈ సినిమా లాంచ్ విషయంలో ఉన్న సస్పెన్స్ రెండు రోజుల క్రితం వీడిపోయింది. మే 31న ఈ సినిమా లాంచ్ కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది.
వార్త ఇక్కడి వరకే అయితే మహేష్ కు కోపం వచ్చి ఉండేది కాదేమో. అయితే ఈ సినిమాకు టైటిల్ సర్కారు వారి పాట అని, మైత్రి మూవీస్, 14 రీల్స్ కలిపి ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు, పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అని, గోపీ సుందర్ లేదా థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తారని పూర్తి వివరాలతో మీడియాకు న్యూస్ లీకైపోయింది. ఇంకేముంది క్షణాల్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు విషయం వెళ్ళిపోయింది.
మీడియాకు విషయం లీకవ్వడంపై తన పీఆర్ టీమ్ సమర్ధంగా పనిచేయలేదని, ఎలా చూసుకున్నా ఇలాంటి విషయాలు లీకైపోతున్నాయని మహేష్ అసహననానికి గురవుతున్నట్లు సమాచారం. ఏదేమైనా ఇలాంటి విషయాలను గుప్పిట్లో దాచి ఉంచడం అయ్యే పని కాదుగా మహేష్.
209461 576951As a result you will need ultra powerful online enterprise tips to maintain operating in finding into matters correct your incredible web-based work. MLM 511040