ఓ గ్రామంలో ఓ వంద ఇళ్ళు వున్నాయనుకుందాం.. అందులో 30 ఇళ్ళో 40 ఇళ్ళో వైసీపీ మద్దతుదారులవో వున్నాయనుకుందాం.. వాటికి వైసీపీ రంగులేసుకోవచ్చు కదా.? ప్రభుత్వ కార్యాలయాలకే వైసీపీ రంగులేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం అనుకోవడమేంటి.? గతంలో చంద్రబాబు హయాంలోనూ ఈ తరహా రంగుల పైత్యం చూశాం. అయితే, చంద్రబాబుని మించిపోయారు ‘రంగుల’ హడావిడి విషయంలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి.
న్యాయస్థానాలు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా ప్రభుత్వ పెద్దల ఆలోచనలు మాత్రం మారడంలేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే పలు మార్లు ప్రభుత్వానికి వైసీపీ రంగుల విషయమై అల్టిమేటం జారీ చేసిన విషయం విదితమే. తాజాగా, వైసీపీ జెండా రంగులతోపాటు మరో రంగుని అదనంగా జోడించి.. దానికి తనదైన స్టయిల్లో వివరణ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. కానీ, హైకోర్టు ఆ వివరణను అంగీకరించలేదు. పైగా, కోర్టు ధిక్కరణ కేసును సుమోటోగా నమోదు చేయనున్నట్లు తాజాగా వెల్లడించింది.
ఈ నెల 28న సుమోటోగా కేసు నమోదు చేయనుంది న్యాయస్థానం.. ఈ వ్యవహారానికి సంబంధించి. మొదటి నుంచీ వైసీపీ ప్రభుత్వం ఈ రంగుల విషయంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.. విపక్షాల నుంచి, సాధారణ ప్రజానీకం నుంచీ. గతంలోనూ ఆయా పార్టీలు తమ హయాంలో పార్టీ రంగుల మీద ఫోకస్ పెట్టడం కన్పించినా, ఈసారి అది మరింత ముదిరి పాకాన పడింది.
ప్రభుత్వ కార్యాలయాలంటే ప్రజల ఆస్తి. కానీ, ప్రభుత్వంలో ఏ పార్టీ వుంటే ఆ పార్టీ, తమ పార్టీకి చెందిన రంగుల్ని ప్రభుత్వ కార్యాలయాలకు వేయాలనుకుంటే ఎలా.? ఈ అంశంపై రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సి వుంది. దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీల రంగులు లేకుండా వుంటే మంచిదేమోన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
మూడు రంగుల్ని ఛీ కొడితే, నాలుగో రంగు తగిలించారు.. ఇప్పుడు ఐదో రంగు తగిలిస్తారా.? లేదంటే, ప్రభుత్వ పెద్దలు తమ ఆలోచనల్ని మార్చుకుంటారా.? వేచి చూడాల్సిందే.
766684 269721This website is my breathing in, real wonderful style and perfect content material . 142326