గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైన విషయం తెల్సిందే. అయితే ఈ వర్షాల నుండి ఊరట లభించే అవకాశాలు కనిపించట్లేదు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
రానున్న నాలుగైదు గంటల్లో విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలియజేసింది. కాబట్టి ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఉండాలని విపత్తులశాఖ కమిషనర్ కన్నబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలకు దిగింది. వరద ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది.
మరోవైపు తెలంగాణలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మధ్య బంగాళా ఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావం కారణంగా రానున్న 48 గంటల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశమున్నట్లు తెలియజేసింది.
590044 691262I discovered your weblog website on google and check several of your early posts. Continue to keep up the quite very good operate. I just additional up your RSS feed to my MSN News Reader. Seeking forward to reading more from you later on! 482316
820972 135603When I came over to this post I can only look at part of it, is this my net browser or the internet internet site? Need to I reboot? 350087
543512 584873Your article is truly informative. A lot more than that, it??s engaging, compelling and well-written. I would desire to see even much more of these types of fantastic writing. 52332
496247 812272dog grooming will be the specialty of my sister, she really loves grooming every dog in our house 337024