ఈ మధ్య గ్లామర్ హీరోయిన్స్ చాలా మంది కేవలం గ్లామర్ పాత్రల్లోనే కాకుండా నటిగా ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ విషయంలో అటు నెగిటివ్ పాత్రల్లో కూడా నటించేందుకు సై అంటున్నారు. తాజాగా ఈ గ్లామర్ హీరోయిన్ కూడా ఇప్పుడు అచ్చంగా అలాంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇంతకీ ఎవరా భామ ఏమా కథ అంటే. ప్రస్తుతం కోలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అయిన హన్సిక మోత్వానీ. తాజాగా ఓ తెలుగు సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించేందుకు ఓకే చెప్పిందట.
ఆ వివరాల్లోకి వెళితే ..అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో హన్సిక ను ఓ మెయిన్ లీడ్ కోసం ఎంపిక చేశారట. అయితే అది పూర్తిగా నెగిటివ్ రోల్ అని తెలిసింది. ఈ కథను మలుపుతిప్పే పాత్ర కావడంతో ఈ అమ్మడు ఓకే అన్నదట. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్సినా ఈ అమ్మడు సౌత్ లో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది.
అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసిన హన్సిక .. ఇప్పుడు అదే బన్నీకి విలన్ గా మారింది. ఇక తమిళంలో వరుస సినిమాలతో జోరుమీదున్న హన్సిక అటు టాలీవుడ్ లో కూడా గట్టి ప్రయత్నాలే చేస్తుంది. మొత్తానికి ఓ పవర్ ఫుల్ పాత్రతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించే ఈ సినిమాలో మాజీ హీరోయిన్ టబు కూడా నటుస్తున్నట్టు తెలిసింది. ఇక నేటినుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
