ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికుల సమ్మె సుఖాంతమైంది. 52 రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు సీఎం కేసీఆర్ ముగింపు పలికారు. ఎలాంటి షరతులూ లేకుండా కార్మికులందరూ తమ ఉద్యోగాల్లో చేరొచ్చని ప్రకటించారు. శుక్రవారం ఉదయమే ఎవరి డిపోలకు వారు వెళ్లి విధుల్లో చేరొచ్చని సూచించారు. ఇందుకు సంబంధించి ఆర్టీసీ ఎండీకి ఆదేశాలిస్తామని వెల్లడించారు.
గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ప్రగతి భవన్ లో సుదీర్ఘంగా కేబినెట్ సమావేశం జరిగింది. ఆర్టీసీ వ్యవహారంపైనే ఇందులో ప్రధానంగా చర్చ జరిగింది. అనంతరం కేబినెట్ వివరాలను సీఎం కేసీఆర్ వెల్లడించారు. కార్మికుల పొట్ట కొట్టే ఉద్దేశం తమకు లేదని, వారు బాగుండాలనే తాము కోరుకుంటామని స్పష్టంచేశారు.
కార్మికులంతా యూనియన్ల మాయలో పడి బతుకులు ఆగం చేసుకున్నారని పేర్కొన్నారు. తన మాట వింటే మంచిగా ఉంటారని, సింగరేణి తరహాలో బోనస్ కూడా తీసుకునే రోజు వస్తుందని వ్యాఖ్యానించారు. తమ మాట విని క్రమశిక్షణతో ఉంటే గుండెల్లో పెట్టుకుంటామన్నారు. అనవసరంగా యూనియన్ల ఉన్మాదంలో పడొద్దని సూచించారు.
ఓ పెద్దన్నగా.. తెలంగాణ బిడ్డగా.. కార్మికులను ఆదుకునేందుకు తక్షణ సాయంగా ప్రభుత్వం నుంచి రూ.100 కోట్లు ఇవ్వనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. అలాగే నష్టాల ఊబిలో ఉన్న సంస్థను కాపాడుకునేందుకు చార్జీలు పెంచక తప్పదని స్పష్టంచేశారు. కిలోమీటర్ కు 20 పైసల చొప్పున చార్జీలు పెంచుకునేందుకు ఆర్టీసీ ఎండీకి వెసులుబాటు కల్పించినట్టు చెప్పారు. సోమవారం నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి ఆర్టీసీ చార్జీలు పెంచామని, ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని ప్రజలు కూడా సహకరించాలని కోరారు. కిలోమీటర్ కు 20 పైసలు పెంచడం వల్ల ఆర్టీసీకి దాదాపు రూ.752 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని, తద్వారా నష్టాలను తగ్గించుకునే అవకాశం వస్తుందన్నారు.
ఇక సమ్మె కాలంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో అర్హులైన ఒకరికి ఆర్టీసీలో లేదా ప్రభుత్వంలో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. త్వరలోనే ప్రతి డిపో నుంచి ఐదుగురు ఆర్టీసీ సిబ్బందిని ప్రగతి భవన్ కు పిలిపించి అన్ని వివరాలూ మాట్లాడతానని, సంస్థ బాగోగులకు ఏం చేయాలో మాట్లాడదామని పేర్కొన్నారు.
యూనియన్లకు బదులు ప్రతి డిపోలో ఇద్దరు సీనియర్లతో మంత్రి అధ్యక్షతన ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. పనిలో పనిగా కేంద్రంపైనా కేసీఆర్ మండిపడ్డారు. ఆర్టీసీలో 31 శాతం వాటా ఉన్న కేంద్రం.. ఆర్టీసీకి రూ.22 వేల కోట్లు ఇవ్వాల్సి వస్తుందన్నారు. దీనిపై త్వరలోనే కేంద్రానికి నోటీసులు ఇస్తామని చెప్పారు. అవసరమైతే ఈ అంశంపై కోర్టుకు కూడా వెళతామని పేర్కొన్నారు. మొత్తానికి కేసీఆర్ ప్రకటనతో కార్మికుల్లో ఆనందం కనిపిస్తోంది.
707428 775142I gotta favorite this internet web site it seems handy . 440002
189659 229269Thank you, Ive lately been seeking for information about this topic for ages and yours is the greatest Ive discovered out so far. But, what in regards towards the bottom line? Are you certain concerning the supply? 187941
521009 27292Does your internet site have a contact page? Im having trouble locating it but, Id like to send you an email. Ive got some suggestions for your blog you might be interested in hearing. Either way, excellent weblog and I look forward to seeing it develop more than time. 92406