Switch to English

ఆర్టీసీ సమ్మె సుఖాంతం.. కార్మికులపై కేసీఆర్ కనికరం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికుల సమ్మె సుఖాంతమైంది. 52 రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు సీఎం కేసీఆర్ ముగింపు పలికారు. ఎలాంటి షరతులూ లేకుండా కార్మికులందరూ తమ ఉద్యోగాల్లో చేరొచ్చని ప్రకటించారు. శుక్రవారం ఉదయమే ఎవరి డిపోలకు వారు వెళ్లి విధుల్లో చేరొచ్చని సూచించారు. ఇందుకు సంబంధించి ఆర్టీసీ ఎండీకి ఆదేశాలిస్తామని వెల్లడించారు.

గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ప్రగతి భవన్ లో సుదీర్ఘంగా కేబినెట్ సమావేశం జరిగింది. ఆర్టీసీ వ్యవహారంపైనే ఇందులో ప్రధానంగా చర్చ జరిగింది. అనంతరం కేబినెట్ వివరాలను సీఎం కేసీఆర్ వెల్లడించారు. కార్మికుల పొట్ట కొట్టే ఉద్దేశం తమకు లేదని, వారు బాగుండాలనే తాము కోరుకుంటామని స్పష్టంచేశారు.

కార్మికులంతా యూనియన్ల మాయలో పడి బతుకులు ఆగం చేసుకున్నారని పేర్కొన్నారు. తన మాట వింటే మంచిగా ఉంటారని, సింగరేణి తరహాలో బోనస్ కూడా తీసుకునే రోజు వస్తుందని వ్యాఖ్యానించారు. తమ మాట విని క్రమశిక్షణతో ఉంటే గుండెల్లో పెట్టుకుంటామన్నారు. అనవసరంగా యూనియన్ల ఉన్మాదంలో పడొద్దని సూచించారు.

ఓ పెద్దన్నగా.. తెలంగాణ బిడ్డగా.. కార్మికులను ఆదుకునేందుకు తక్షణ సాయంగా ప్రభుత్వం నుంచి రూ.100 కోట్లు ఇవ్వనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. అలాగే నష్టాల ఊబిలో ఉన్న సంస్థను కాపాడుకునేందుకు చార్జీలు పెంచక తప్పదని స్పష్టంచేశారు. కిలోమీటర్ కు 20 పైసల చొప్పున చార్జీలు పెంచుకునేందుకు ఆర్టీసీ ఎండీకి వెసులుబాటు కల్పించినట్టు చెప్పారు. సోమవారం నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపారు.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి ఆర్టీసీ చార్జీలు పెంచామని, ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని ప్రజలు కూడా సహకరించాలని కోరారు. కిలోమీటర్ కు 20 పైసలు పెంచడం వల్ల ఆర్టీసీకి దాదాపు రూ.752 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని, తద్వారా నష్టాలను తగ్గించుకునే అవకాశం వస్తుందన్నారు.

ఇక సమ్మె కాలంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో అర్హులైన ఒకరికి ఆర్టీసీలో లేదా ప్రభుత్వంలో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. త్వరలోనే ప్రతి డిపో నుంచి ఐదుగురు ఆర్టీసీ సిబ్బందిని ప్రగతి భవన్ కు పిలిపించి అన్ని వివరాలూ మాట్లాడతానని, సంస్థ బాగోగులకు ఏం చేయాలో మాట్లాడదామని పేర్కొన్నారు.

యూనియన్లకు బదులు ప్రతి డిపోలో ఇద్దరు సీనియర్లతో మంత్రి అధ్యక్షతన ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. పనిలో పనిగా కేంద్రంపైనా కేసీఆర్ మండిపడ్డారు. ఆర్టీసీలో 31 శాతం వాటా ఉన్న కేంద్రం.. ఆర్టీసీకి రూ.22 వేల కోట్లు ఇవ్వాల్సి వస్తుందన్నారు. దీనిపై త్వరలోనే కేంద్రానికి నోటీసులు ఇస్తామని చెప్పారు. అవసరమైతే ఈ అంశంపై కోర్టుకు కూడా వెళతామని పేర్కొన్నారు. మొత్తానికి కేసీఆర్ ప్రకటనతో కార్మికుల్లో ఆనందం కనిపిస్తోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...