తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది పొంగి ప్రవహస్తోంది. వాగులు, వంకల నుంచి గోదావరిలోకి నీటి ప్రవాహం పెరిగుతోంది. దీంతో ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. ఈమేరకు కేంద్ర జలసంఘం హెచ్చరికలు జారీ చేసింది. ఒక అంచనా ప్రకారం ఈరోజు రాత్రి 9గంటలకు ప్రమాద స్థాయి దాటి ప్రవహించొచ్చని పేర్కొంది.
సరిగ్గా 34 ఏళ్ల క్రితం.. 1986 ఆగష్టు 16వ తేదీన ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవహించింది. ఈ లెక్కలను జలసంఘం పేర్కొంది. ఇన్నేళ్లకు ప్రమాదం అంచున గోదావరి ప్రవహిస్తూండటంతో ఈరోజు రాత్రి అప్పటి మార్క్ దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఆరోజు అత్యధికంగా 56.6 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి నది ప్రస్తుతం 53 అడుగుల వద్ద ప్రవహిస్తోంది.
ఈరోజు రాత్రికి 56 అడుగులు దాటుతుందని జలసంఘం అంచనా వేస్తోంది. ఈమేరకు అత్యవసర సమయాల్లో సహాయక చర్యల కోసం ఫోన్ చేయాలంటూ 040 – 423 450 624 నెంబర్ ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం భధ్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 2014 తర్వాత గోదావరికి ఇప్పటికి 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం విశేషం. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నదీ పరిహాక ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ వరద పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
696666 584050Beging with the entire wales effectively before just about any planking. Our own wales can easily compilation of calculated forums those thickness analysts could be the similar to some with the shell planking along with more significant damage so that they project right after dark planking. planking 745988