తూర్పు లడఖ్ లోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో చైనా సైనికులు ఎంత మంది చనిపోయారనే విషయాన్ని డ్రాగన్ ఇప్పటికీ వెల్లడించలేదు. జూన్ 15న చైనా దొంగ దెబ్బ తీయడం.. దానికి ధీటుగా భారత సైనికులు స్పందించి డ్రాగన్ సేనలను ఊచకోత కోయడం తెలిసిందే. ఆ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులు కాగా.. వారికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపి భారత్ తగిన విధంగా నివాళులు అర్పించింది.
అయితే, ఆ ఘటనలో పెద్ద ఎత్తున చైనా సైనికులు మరణించినా.. డ్రాగన్ ఆ విషయాన్ని అంగీకరించలేకపోయింది. వారికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం మాట అటుంచితే.. కనీసం కుటుంబ సభ్యులకు కూడా వారి మృతదేహాలను అప్పగించలేకపోయింది.
తాజాగా దీనికి సంబంధించిన కీలకమైన విషయాలు వెలుగుచూశాయి. సదరన్ జిన్ జియాంగ్ జిల్లాలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 69316 యూనిట్ లో భారీగా సమాధులు ఉన్నాయి. ఇటీవలే నిర్మించిన ఆ సమాధులపై గల్వాన్ లో భారత్ తో జరిగిన పోరులో అమరులైన సైనికులు అని రాసి ఉంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వెలుగు చూడటంతో నాటి ఘర్షణల్లో చనిపోయినవారి లెక్క తెలిసింది.
ఓ బ్రిగేడియర్ ర్యాంకు అధికారి సహా మొత్తం 106 సమాధులు అక్కడున్నాయి. తమ సైనికులు ఎంతమంది చనిపోయో చైనా చెప్పకపోయినా.. అసలు సత్యాన్ని ఆ సమాధులు చెప్పాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మరోవైపు రాజ్యకాంక్షతో రగిలిపోతున్న చైనాకు భారత్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సరిహద్దుల్లో మనల్ని ఇబ్బంది పెడుతున్న డ్రాగన్ ఎత్తుకు పై ఎత్తు వేసింది. చైనా కు సమీపంలో ఆధునికమైన యుద్ధనౌకను మోహరించింది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి అత్యంత తెలివిగా మన యుద్ధనౌకను తరలించింది. ఈ ఆపరేషన్ మొత్తం చాలా రహస్యంగా సాగింది.
ఇప్పటికే ఆ జలాల్లో సంచరిస్తున్న అమెరికా యుద్ధనౌకలతో సమాచారాన్ని రహస్యంగా పంచుకుంటూ భారత యుద్ధనౌక అక్కడకు చేరింది. ఈ విషయం తెలియడంతో డ్రాగన్ షాక్ కు గురైంది. భారత్ ఇలాంటి సాహసోపేత చర్యకు పూనుకుంటుందని ఊహించని చైనా.. ఈ విషయాన్ని దౌత్య చర్చల్లో ప్రస్తావించింది. ఇది సరికాదని అసంతృప్తి వ్యక్తంచేసింది.
వాస్తవానికి దక్షిణ చైనా సముద్ర జలాలపై ఎప్పటినుంచో వివాదం నడుస్తోంది. ఆ ప్రాంతంలో ఉన్న సహజవనరులపై కన్నేసిన చైనా.. అందులో సింహభాగం తనదేనని చైనా వాదిస్తుండగా.. సమీప దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో చైనా ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో మన నౌకను అక్కడకు తరలించడం ద్వారా భారత సత్తా ఏమిటో డ్రాగన్ కు తెలియజెప్పినట్టయింది. ఇక అండమాన్ వద్ద కూడా భారత నౌకాదళం యుద్దనౌకలను మోహరించి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సన్నద్ధంగా ఉంది.
548483 766410The vacation delivers on offer are : believed a selection of some with the most selected and in addition budget-friendly global. Any of these lodgings tend to be very used along units might accented by indicates of pretty shoreline supplying crystal-clear turbulent waters, concurrent with the Ocean. hotels packages 899734
84630 911344I discovered your weblog website internet site on the internet and appearance some of your early posts. Continue to keep in the wonderful operate. I just now additional increase your Rss to my MSN News Reader. Seeking toward reading far far more from you locating out at a later date! 359077