కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే వ్యాక్సిన్ వేయించుకోవడం మినహా మరో మార్గం లేదని ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు స్పష్టంచేస్తుంటే.. నెట్టింట మాత్రం కొన్ని అసత్యాలు వెల్లువలా వైరల్ అవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారంతా రెండేళ్లలో మరణిస్తారంటూ చక్కర్లు కొడుతున్న ఓ వార్త పలువురిని ఆందోళన గురిచేస్తోంది.
ఈ నేపథ్యంలో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ రంగంలోకి దిగి నిజానిజాలు నిగ్గు తేల్చింది. అదంతా నకిలీ అని.. అందరూ ఎలాంటి సంకోచాలూ లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని స్పష్టంచేసింది. ‘కరోనా టీకాలు వేయించుకున్నవారంతా రెండేళ్లలో చనిపోతారని పేర్కొంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దానిని నిజమని నమ్మించేందుకు నోబెల్ బహుమతి గ్రహీత ఫొటో కూడా దానిపై వేశారు.
అంతేకాకుండా కెనడాకు చెందిన ఓ అతివాద వెబ్ సైట్ ప్రచురించిన వార్తను కూడా ప్రచారంలోకి తెచ్చారు. కానీ అదంతా పూర్తిగా అవాస్తవం. కరోనా టీకా సురక్షితమైంది. ఆ నకిలీ వార్తలను ఎవరికీ ఫార్వార్డ్ చేయకండి’ అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. ఈ వార్తను కెనడాకు చెందిన లైఫ్ సైట్ న్యూస్ అనే వెబ్ సైట్ ప్రచురించింది. అది ఓ అతివాద వెబ్ సైట్. అందులో వచ్చే కథనాలన్నీ ఆచార వ్యవహారాలు, నమ్మకాలపైనే ఉంటాయి.
316543 362354I took a break to view your post. I identified it very relaxing 988253
729279 129328hi and thanks for the actual blog post ive recently been looking regarding this specific advice on-line for sum hours these days as a result thanks 401807