సౌత్ నుండి చాలా మంది హీరోలు గతంలో ప్యాన్ ఇండియా ఇమేజ్ కోసం ప్రయత్నించారు కానీ ఆ ప్రయత్నాలు ఏవీ వర్కౌట్ అవ్వలేదు. అయితే ఈ విషయంలో ప్రభాస్ ఇప్పుడు అనుకున్నది సాధించేలానే కనిపిస్తున్నాడు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ కు నార్త్ లో తగినంత గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సాహో చేసినా అది ప్లాపైంది. అయితే ఇక్కడ కూడా ప్రభాస్ కు కలిసొచ్చే అంశం ఏమిటంటే సాహో నార్త్ లో సూపర్ వసూళ్లు సాధించింది. బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రభాస్ ను ఓన్ చేసుకున్నారు ప్రజలు.
దీంతో ప్రభాస్ బడా ప్లాన్ వేసాడు. ప్రస్తుతం రాధే శ్యామ్ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ ను చేస్తున్నాడు ప్రభాస్. దీని తర్వాత మూడు సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. బాలీవుడ్ దర్శకుడితో మైథలాజికల్ డ్రామా ఆది పురుష్, సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించనున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చేయనున్నాడు. ఇది శాండల్ వుడ్ ప్రొడక్షన్ అయినా కానీ దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని చేయనున్నాడు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ డ్రామాను చేయనున్నాడు. ఈ చిత్రంలో దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ వంటి హేమా హేమీలు ఈ చిత్రంలో నటిస్తారు.
ప్యాన్ ఇండియా అంటే ఆషామాషీగా కాకుండా బడా ప్రయత్నాలే చేస్తున్నాడు. ఈ నాలుగు సినిమాలను కలుపుకుని దాదాపు 1400 కోట్ల బడ్జెట్ పెట్టుబడులు ఉన్నాయి. భారీ బడ్జెట్ ఉండడంతో ప్రభాస్ పై ప్రెజర్ ఉంది.
ఇలా వరసగా డిఫరెంట్ జోనర్లు, డిఫరెంట్ ఇండస్ట్రీలకు చెందిన వారితో పనిచేస్తోన్న ప్రభాస్ ప్యాన్ ఇండియా లెవెల్లో సెటిల్ అవ్వడానికి పెర్ఫెక్ట్ స్కెచ్ ను రెడీ చేసుకున్నాడు.
633353 719776I just couldnt depart your web site prior to suggesting that I extremely enjoyed the normal details an individual provide for your visitors? Is gonna be back frequently to be able to inspect new posts 470192
555473 517313I believe this internet site has some really excellent information for everybody : D. 943919