హెల్మెట్ లేని ప్రయాణం నేరం.. ఆ నేరానికి జరీమానా విధించాల్సిందే. జరీమానా ఎంత పెద్దదైతే వాహనదారుల్లో అంత భయం పుడుతుందన్నది కొత్తగా కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన చట్టం తాలూకు సారాంశం. తాజాగా, ఈ-సిగరెట్లు, ఈ-హుక్కాలపై కేంద్రం నిషేధం విధించింది. వీటిని వినియోగిస్తున్నవారిలో 70 శాతం మంది యువతేనన్నది కేంద్రం వాదన. అది నిజమే కావొచ్చు.
ఈ-సిగరెట్లు, ఈ – హుక్కా ప్రమాదకరమే.. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. దేశంలో పొగాకు ఉత్పత్తుల వినియోగం మాటేమిటి.? ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు కఠినతరమైన జరీమానాల్ని విధిస్తోన్న కేంద్రం, పొగాకు ఉత్పత్తుల్ని నిషేధించగలదా.? అంత దమ్ము కేంద్రానికి వుందా.? లేదా.? దేశంలో జరుగుతోన్న చర్చ ఇది.
ఈ-సిగరెట్, ఈ-హుక్కాలతో జరిగే నష్టం కంటే, పొగాకు ఉత్పత్తులతో కలిగే నష్టం చాలా చాలా ఎక్కువ. దేశంలో ఇటీవలి కాలంలో పెరిగిపోయిన క్యాన్సర్ కేసుల్లో సింహభాగం పొగాకు ఉత్పత్తుల కారణంగా సంభవించినవే. దేశవ్యాప్తంగా క్యాన్సర్ రీసెర్చ్ కేంద్రాల్ని పెంచడం మంచిదే.. కానీ, ఆ క్యాన్సర్ కారకాల్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నాం.? ఎందుకంటే, పొగాకు కూడా దేశ వ్యవసాయ రంగంలో ఓ భాగం. పొగాకు పంటని నమ్ముకుని దేశంలో చాలామంది రైతులు జీవనోపాధి పొందుతున్నారు. అదీ అసలు సమస్య.
అయితే, ఆ పొగాకు ప్రాణాల్ని తోడేస్తున్న దరిమిలా, ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రభుత్వాలు రైతుల్ని ప్రోత్సహించేందుకు వీలుంది. కానీ, పొగాకు విక్రయాల ద్వారా వచ్చే పన్నులు, దేశ ఖజానాకి అవసరం. అదీ అసలు సమస్య. పొగాకు ఒక్కటే కాదు, ఆల్కహాల్ విషయంలోనూ ప్రభుత్వాల ఆలోచనలు వేరేలా వుంటాయ్. దేశానికి ఏదో చేసేస్తున్నాం.. అన్న బావనలో ఈ-సిగరెట్లను, ఈ- హుక్కాల్ని నిషేధించడం మినహాయిస్తే, ప్రజారోగ్యంపై కేంద్రానికి చిత్తశుద్ధి వుందని ఎలా అనుకోగలం.?
563677 947084I see something genuinely intriguing about your internet web site so I saved to bookmarks . 863313