బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. అయితే ఈ కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేతికి వెళ్ళాక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా డ్రగ్స్ వాడకం ఉందని తేలాక కేసు స్వరూపమే మారిపోయింది. ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తిని అరెస్ట్ చేసి విచారించగా మరికొన్ని పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకోన్, శ్రద్ధా కపూర్ లను నార్కోటిక్స్ అధికారులు విచారించారు.
ఈ సందర్భంగా దీపికా పదుకోన్, శ్రద్ధా కపూర్ లు ఇచ్చిన స్టేట్మెంట్లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇద్దరూ కూడా డ్రగ్స్ విషయమై చాట్స్ చేసినట్లుగా ఒప్పుకున్నారు. ముఖ్యంగా ఛిచోరే సక్సెస్ పార్టీలో డ్రగ్స్ వాడకం జరిగిందని శ్రద్ధా ఒప్పుకుందిట. ఒక బాలీవుడ్ మీడియా చెప్పినదాని ప్రకారం ఇద్దరూ కూడా ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని వెల్లడించినట్లు తెలుస్తోంది.
అయితే సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ సుశాంత్ పై సంచలన ఆరోపణలు చేసారు. సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు విపరీతంగా ఉందని, సెట్స్ లో షూటింగ్ గ్యాప్ లో కూడా డ్రగ్స్ తీసుకున్నాడని వారు తెలపడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
197515 971973As I internet site possessor I believe the content material matter here is rattling magnificent , appreciate it for your hard work. You should maintain it up forever! Very best of luck. 404320
455143 947589How much of an special write-up, maintain on posting much better half 54764