సీనియర్ హీరో రాజశేఖర్ గరుడవేగ చిత్రంతో కంబ్యాక్ ఇచ్చిన విషయం తెల్సిందే. అయితే తర్వాత కల్కి చిత్రంతో ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కల్కి తర్వాత కొంత బ్రేక్ తీసుకున్న రాజశేఖర్ మళ్ళీ వరస ప్రాజెక్ట్స్ ను లైన్లో పెడుతున్నాడు. ముందుగా జాతీయ అవార్డు గెలుచుకున్న నీలకంఠతో రాజశేఖర్ సినిమా చేయబోతున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఒక రిటైర్ అయిపోయిన పోలీస్ ఆఫీసర్ పై తన మాజీ భార్య హత్యకు సంబంధించిన ఆరోపణలు వస్తాయి. ఆ ఆరోపణల వెనకాల ఉన్న కథేంటి? అసలు ఆ హత్య ఎవరు చేసారు వంటి విషయాలతో ఆసక్తిగా సాగుతుంది ఈ చిత్రం.
అక్టోబర్ 3 నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఫేడ్ అవుట్ అయిపోయిన రిచా పనైను హీరోయిన్ గా ఫిక్స్ చేసారని తెలుస్తోంది. యముడికి మొగుడు, ఈడు గోల్డ్ ఎహే చిత్రాలు చేసింది ఆ హీరోయిన్. ఆ తర్వాత మలయాళ సినిమాలకు పరిమితమైంది. మళ్ళీ ఈ హీరోయిన్ ను తెలుగు తెరపైకి తీసుకొస్తున్నారు.
ఈ చిత్రం కాకుండా పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రాజశేఖర్ సినిమా చేయాల్సి ఉంది.
774467 273421really like your imagination!!!! great function!! oh yeah.. cool photography too. 890347