తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బంధు పథకంపై చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దళిత బంధును అమలు చేయాల్సిందే అనే పట్టుదలతో ఉన్న కేసీఆర్ తాజాగా కేబినేట్ మీటింగ్ లో చర్చించారు. దళిత బంధు పథకంను ఈనెల 16న హుజూరాబాద్ లో ప్రారంభించాల్సిందిగా కేబినేట్ నిర్ణయించింది. హుజూరాబాద్ లో ప్రయోగాత్మకంగా దళిత బంధు అక్కడ అమలు చేసి ఆ తర్వాత రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
దళిత బంధుపై కొందరు కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో మరీ ఆలస్యం చేయకూడదు అనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే ఈ పథకంను అమలులోకి తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తోంది. ఈనెల 16న హుజూరాబాద్ లో నిర్వహించబోతున్న సమావేశంలో సీఎం కేసీఆర్ హాజరు అవ్వబోతున్నారు. ఆ కార్యక్రమంలోనే కేసీఆర్ చేతుల మీదుగా దళిత బంధు చెక్కులను దళితులకు అందించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ పథకం లక్ష్యం నెరవేరేలా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలంటూ ఈ సందర్బంగా కేసీఆర్ పిలుపునిచ్చారు.
143 651758Generally I dont learn post on blogs, even so I wish to say that this write-up really pressured me to try and do it! Your writing taste has been surprised me. Thank you, quite great write-up. 878753