ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే అందరి చూపు పడే ఏకైక జట్టు చెన్నై సూపర్ కింగ్స్. మూడు సార్లు టైటిల్ విజేతగా.. ఐదు సార్లు రన్నరప్ గా తిరుగులేని రికార్డు సీఎస్కే సొంతం. ఇందుకు ధనాధన్ ధోనీ కెప్టెన్సీ కూడా మరో కారణం. ఈ ఏడాది కూడా సీఎస్కేపై భారీ అంచనాలే పెట్టుకున్నారు అభిమానులు. కానీ.. ఈ సీజన్ లో సీఎస్కే కనీసం ప్లేఆఫ్ దాటలేకపోయింది. దీంతో ఫ్యాన్స్ లో అసంతృప్తి రగిలిపోతోంది. టీమ్ మార్చాలని, ధోనీనే మార్చాలంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
వీటన్నింటికీ సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ‘ఐపీఎల్ 2021 సీజన్లో కూడా సీఎస్కే కు ధోనినే సారథ్యం వహిస్తాడు. ఐపీఎల్ లో సీఎస్కే ధోనీ సారధ్యంలోనే 3 సార్లు టైటిల్స్ అందుకుంది. ప్లేఆఫ్ కు వెళ్లకుండా వెనుదిరగడం ఇదే తొలిసారి. ఈ ఒక్క వైఫల్యంతోనే టీమ్ లో మార్పులు చేయాలనుకోవడం లేదు. స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయాం. సురేశ్ రైనా, హర్భజన్ సింగ్.. వంటి ఆటగాళ్లు దూరమవడం.. కరోనా ఎఫెక్ట్ కూడా జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది’ అని చెప్పుకొచ్చారు.
అయితే.. కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాత్రం జట్టు ఆటతీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని తెలుస్తోంది. ‘ఏజింగ్ స్క్వాడ్, దుబాయ్ ఓ చాలెంజ్ విసిరింది. మా అవసరాలేంటో చెప్పింది’ అన్నాడు. దీంతో ధోనీ మార్పు గానీ.. టీమ్ లో మార్పు గానీ ఖాయమంటూ మరికొన్ని వార్తలు రౌండ్ అవుతున్నాయి. మరోవైపు.. ధోనీ తన జెర్సీని హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, రాజస్థాన్ ప్లేయర్ జోస్ బట్లర్ కు బహుకరించడంతో ధోనీ రిటైర్ అయిపోవడం ఖాయమనే వార్తలూ వస్తున్నాయి.
122672 475908Hey there! Good post! Please inform us when we will see a follow up! 878193
667015 159260Man you legend. return see my website, you need to get pleasure from it. 141012
543051 890415Usually I try and get my mix of Vitamin E from pills. Even though Id really like to through a amazing meal plan it can be rather hard to at times. 723792