ప్రకృతికి మనిషి ఏమిస్తే, అదే మనకి ప్రకృతి ఇస్తుంది.! ఎప్పటినుంచో చాలామంది చాలా చాలా రకాలుగా చెబుతున్నారు. కొన్ని సినిమాలు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించాయి. కానీ, మనిషి మాత్రం ప్రకృతిని నాశనం చేస్తూనే వున్నాడు. ఫలితం, ఈ రోజు ప్రకృతి కన్నెర్రజేసింది.. ఇప్పుడే తాను మనిషినని ప్రతి మనిషీ గుర్తించాల్సి వుంటుంది. సాటి మనిషిని ఆదుకోవడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని. ఇకపై ఎప్పుడూ ప్రకృతిని నాశనం చేయబోమని ప్రతి మనిషీ ప్రతిన బూనాల్సిన సందర్భమిది.
మార్చి 31 వరకు దేశమంతా లాక్ డౌన్ కొనసాగనుందన్నది ప్రస్తుతానికి డిక్లేర్ అయిన విషయం. ఏప్రిల్ 1న కొత్త జీవితం ఆరంభమవుతుందా.? ఇంకొన్నాళ్ళు నాలుగ్గోడలకే పరిమితమవుతామా.? ఎన్నాళ్ళు ఈ ‘లాక్ డౌన్’ కొనసాగుతుంది.? ఇలా సవాలక్ష ప్రశ్నలు సగటు ప్రజానీకాన్ని ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి.
ఆందోళన, భయం సహజమే. కానీ, వాటిని కాస్త పక్కన పెట్టి, ఈ సమయంలో మనం చేసిందేమిటి.? మనం చేస్తున్నదేమిటి.? మనం చేయాల్సిందేమిటి.? అని ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భమిది. ఓ సినీ నటుడు, తన వంతుగా 20 లక్షల విరాళం ఇస్తే, చేసిన మంచి పనిని గుర్తించాల్సింది పోయి, బూతులతో విరుచుకుపడ్డారు కొందరు నెటిజన్లు. మనుషుల్లో ఇలాంటి మృగాలు సమాజానికి పెను ప్రమాదం తెచ్చిపెడుతున్నాయి. సమాజం కలుషితమయిపోవడానికి ఇలాంటోళ్ళే కారణం.
ప్రభుత్వాలు చేయగలిగినంత మాత్రమే చేస్తాయి.. ఆ తర్వాత మనకి మనమే సాయం చేసుకోవాలి. ఏమో, ఆ పరిస్థితి కూడా ముందు ముందు రావొచ్చేమో. ఇప్పటినుంచే అన్నిటికీ సిద్ధపడాలి. అన్నిటికీ మించి, మనల్ని మనం చాలా చాలా మార్చుకోవాలి. ప్రకృతిని నాశనం చేయబోమని నినదించాలి.. సాటి మనిషి పట్ల బాధ్యత, గౌరవం పెంపొందించుకోవాలి.. పోష్ కల్చర్ వంటివాటి వైపు వెళ్ళాలనే ఆలోచన వస్తే, ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి. కరోనా వైరస్ నేర్పుతున్న పాఠమిది. కానీ, ఆ పాఠం నేర్చుకునేది ఎంతమంది.? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
189462 836482I must admit that this is one great insight. It surely gives a company the opportunity to get in on the ground floor and truly take part in creating something special and tailored to their needs. 735246