కరోనా వైరస్ అనేది ఎంత ప్రమాదకరమైనదో మన జనాల తలకెక్కడంలేదు. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్లపై తిరుగుతున్నారు. సెలవులు ఇచ్చింది షికార్లు చేయడానికి కాదని అధికారులు ఎంతగా చెబుతున్నా అందరూ లైట్ తీసుకుంటున్నారు. ఇటలీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తేగానీ అలాంటివారికి విషయం బోధపడదని అంటున్నారు.
చైనాలో ఈ వైరస్ విజృంభిస్తున్న సమయంలో కొన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకున్నా.. ఇటలీ అంతగా పట్టించుకోలేదు. తమకు ఏం కాదనే ధీమా వారిలో కనిపించింది. పైగా హోం క్వారంటైన్ అనేది రాతియుగం నాటి విధానమని, అది అనవసరమని పేర్కొంది. ఆ దేశ ప్రధాని చెప్పిన మాటలను సైతం ఇటలీ పౌరులు పెడచెవిన పెట్టారు. ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర ఇటలీ ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తోంది. ఎక్కడ చూసినా కరోనా రోగులు, ఆ వైరస్ తో ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలే కనిపిస్తున్నాయి.
లెక్కకు మిక్కిలిగా వస్తున్న కరోనా రోగులకు చికిత్స చేయడానికి సరిపడా సౌకర్యాలు, మెడికల్ కిట్లు లేకపోవడంతో ఇటలీ తీవ్రంగా సతమతమవుతోంది. దీంతో కరోనా సోకిన వృద్ధులకు చికిత్స చేయలేక అలా వదిలేసే భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇదంతా ఒక అంశమైతే.. కరోనాతో చనిపోయినవారికి అంత్యక్రియలు చేసే పరిస్థితి కూడా అక్కడ కనిపించడంలేదు. కుప్పలుతెప్పలుగా వస్తున్న మృతదేహాలను ఖననం చేయడానికి స్థలం ఉండటంలేదు. ఇక విద్యుత్ శ్మశానవాటికలు 24 గంటలూ పనిచేస్తున్నాయి. దీంతో శ్మశానానికి వస్తున్న శవాలను వెనక్కి తిప్పి పంపుతున్నారు.
కొన్నాళ్లపాటు మీ ఇంట్లోనే శవాన్ని భద్రపరచాలని, మీ వంతు వచ్చిన తర్వాత తీసుకురావాలని పేర్కొంటున్నారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో ఇటలీ కొట్టుమిట్టాడుతుండగా.. ఇండియాలో మాత్రం జనం కరోనాను లైట్ తీసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రజలు ఇళ్లకే పరిమితమై కరోనాను తరిమికొట్టాలి.
894214 452577Extremely intriguing topic , thanks for posting . 903231
63167 119193A very exciting go through, I may possibly not agree completely, but you do make some actually legitimate factors. 137905
20655 650202Located your weblog and decided to have a study on it, not what I normally do, but this blog is great. Awesome to see a site thats not spammed, and in fact makes some sense. Anyway, wonderful write up. 305302