తెలంగాణలో ఈ రోజు కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ సంఖ్య 15గా వుంది. అంటే, కరోనా వైరస్ తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో కాస్త తగ్గుముఖం పడుతున్నట్లే భావించాలేమో. అయితే, అప్పుడే సంబరపడిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే, తీసుకున్న శాంపిల్స్.. ఆ ఫలితాలు రావడం.. ఇదంతా ఓ ప్రసహనంగా తయారైంది.
ఈ నేపథ్యంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్ని చూసి జనం లైట్ తీసుకుంటే పరిస్థితులు తారుమారైపోతాయి. వున్నంతలో కాస్త ఊరటగానే ఈ ‘తక్కువ కేసుల నమోదు’ని భావించాల్సి వుంటుంది. పరిస్థితి కొంత అదుపులోకి వస్తుండడంతో.. ఇప్పుడే మరింత కరిÄనంగా ‘లాక్ డౌన్’ని అమలు చేయాల్సి వస్తుంది. రానున్న 10 నుంచి 15 రోజులు అత్యంత కీలకమైనవిగా భావిస్తున్నాయి తెలుగు రాష్ట్రాలు.
ఏప్రిల్ 22 నాటికి పూర్తిగా తెలంగాణలో కరోనా అదుపులోకి వస్తుందని తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోపక్క, ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. అయితే, ఇంకా పెద్దయెత్తున కరోనా టెస్టులు నిర్వహించాల్సి వుందన్న భావన వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతోందనుకోండి.. అది వేరే సంగతి.
కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు కన్పిస్తున్నా.. ఇంకోపక్క తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ (కోవిడ్ 19)కి సంబంధించి వైద్య చికిత్స కోసం కనీ వినీ ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇండియా లాంటి దేశాల్లో చిన్నపాటి నిర్లక్ష్యం కొంప ముంచేస్తుందని చెప్పడానికి నిజాముద్దీన్ తబ్లిగ్ మర్కజ్ ఘటనే నిదర్శనం. ఆ ఘటన జరగకపోయి వుంటే.. దేశంలో ఇప్పుడు వేల స్థాయిలో కేసులు నమోదయి వుండేవే కావు. తెలుగు రాష్ట్రాల్లోనూ కేవలం వంద లోపు కేసులు నమోదయి వుండేవి.
సో, రానున్న రెండు వారాలు చాలా చాలా కీలకం. ప్రభుత్వాలు తీసుకునే చర్యలకంటే, ప్రజలు ఎంత బాధ్యతగా వ్యవహరించారన్నదానిపైనే తెలుగు రాష్ట్రాల భవిష్యత్ ఆధారపడి వుంటుంది కరోనా వైరస్ విషయంలో. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వాలకి ప్రజలు పూర్తి మద్దతు ఇవ్వాల్సిందే.. అదే సమయంలో, ప్రభుత్వాలూ.. ప్రజల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిందే.
945560 572775hi there, your web site is discount. Me thank you for do the job 130449