మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు తగ్గుతుండగా.. మహారాష్ట్రలో మాత్రం పెరుగుతున్నాయి. వరుసగా ఐదో రోజు కూడా రోజువారీ కేసులు విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం ఆ రాష్ట్రంలో కొత్తగా 4,092 కేసులు వెలుగుచూశాయి. గత నెల రోజులుగా ఇన్ని కేసులు నమోదు కాలేదు. గతనెల 6న మహారాష్ట్రలో 4,382 కేసులు నమోదు కాగా.. మళ్లీ ఆదివారమే 4వేల మార్కు దాటడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 20,64,278కి చేరింది.
ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడి 51,529 మంది మరణించారు. ఇక ముంబైలో 3,14,076 మంది కరోనా బారిన పడగా.. 11,419 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 35,965 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే మహారాష్ట్రలో మళ్లీ కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని ఆంక్షలు విధించింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కేరళ నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేసింది.
855135 221930Really informative and excellent bodily structure of content material , now thats user friendly (:. 847097
260489 651729conclusion that you are definitely appropriate but several require to be 550674
188885 861393Someone essentially lend a hand to make critically articles Id state. That is the first time I frequented your website page and so far? I amazed with the research you produced to create this actual post extraordinary. Wonderful activity! 93868
635548 351611you could have a great weblog here! would you wish to make some invite posts on my weblog? 843166