దేశంలో ఆర్ధిక నేరాలకు పాల్పడిన వారి సంఖ్య ఎక్కువే ఉంది. వారిలో సందేశరా సోదరుల ఆంధ్రాబ్యాంక్ కన్సార్టియం తీసుకున్న రుణం ఒకటి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రుణం తీసుకుని ఎగ్గొట్టి దేశంలో సంచలనం సృష్టించిన నీరవ్ మోదీ స్కాం కంటే సందేశారా సోదరుల కుంభకోణమే పెద్దది. ఈ కుంభకోణంతో సంబంధముని భావిస్తున్నవారిని ఈడీ ప్రశ్నిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఇంటికి ఈడీ అధికారులు వెళ్లారు.
ముగ్గురు సభ్యులున్న బృందం ఆయన్ను వేలకోట్ల కుంభకోణంకు సంబంధించిన సందేశారా సోదరుల కేసులో ఆయన్ను ప్రశ్నించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన నుంచి సమాచారం తీసుకున్నామని అధికారులు వివరించారు. గుజరాత్ కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ సంస్థ, ఆంధ్రా బ్యాంకు నుంచి 5,383కోట్ల రుణాలను పొందింది. అయితే ఈ రుణం చెల్లింపులు సవ్యంగా జరగలేదు. దీంతో ఈ విలువ 8,100 కోట్లకు పెరిగిపోయింది.
బ్యాంకులకు రుణాలు చెల్లింపులు ఎగ్గోట్టిన చేతన్ సందేశారా, నితిన్ సందేశారా సోదరులతో అహ్మద్ పటేల్ కు సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈడీ అధికులు అహ్మద్ పటేల్ ను ప్రశ్నించారు. ప్రస్తుత కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం తాను విచారణకు రాలేనని అహ్మద్ పటేల్ చెప్పగా అధికారులే ఆయన ఇంటికి వెళ్లారు. ఈ కేసులో 2017లోనే ఎఫఐఆర్ నమోదు చేసింది సీబీఐ.
589939 471797Typically I do not read write-up on blogs, even so I wish to say that this write-up extremely forced me to have a look at and do so! Your writing taste has been amazed me. Thanks, really wonderful post. 712243
492690 555625wohh precisely what I was searching for, thankyou for putting up. 12708
621778 136211you got a quite superb website, Sword lily I located it via yahoo. 558331