నిన్నటి విశాఖ పర్యటన సందర్భంగా గంటల తరబడి ట్రాఫిక్ ఆంక్షలపై సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పర్యటన సందర్భంగా గంటలతరబడి ట్రాఫిక్ ఎందుకు నిలిపేశారని అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురిచేశారని సీఎం ప్రశ్నించారు.
ట్రాఫిక్ జామ్, ప్రజల ఇబ్బందులపై విచారణ చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులకు గురి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆదేశించారు.
నిన్నటి పర్యటనలో శారదా పీఠాన్ని సందర్శించిన సీఎం జగన్ దాదాపు మూడున్నర గంటలు అక్కడే ఉన్నారు. ఈ సమయంలో ట్రాఫిక్ ను అధికారులు నిలిపివేశారు. ఆయా మార్గాల్లో దుకాణాలు కూడా మూసివేయించారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎన్ఏడీ కూడలి నుంచి పెందుర్తి, కంచరపాలెం, గాజువాక, ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు మార్గాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
642349 822909Just wanna comment which you have a extremely nice website, I the style and style it really stands out. 578291
822087 133389This web web site is normally a walk-through its the information you wished about this and didnt know who ought to. Glimpse here, and youll definitely discover it. 240340
83575 114808I like the way you conduct your posts. Have a nice Thursday! 672746