రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను వెంటనే పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతుల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతుల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. నాడు-నేడులో భాగంగా పనుల్లో పురోగతి కనిపిస్తోందని అన్నారు. పంచాయతీ రోడ్ల మరమ్మతులు, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని.. నివర్ తుపాను బాధిత ప్రాంతాల్లోనూ చర్యలు చేపట్టాలని అన్నారు.
ఎక్కడా పనులు పెండింగ్ లో ఉండకూడదని.. గుంతల్లేకుండా రోడ్లను వేయాలని అన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో జూలై 15 నాటికి గుంతలు పూడ్చాలని.. 20లోపు పనులకు సంబంధించి ఫొటో గ్యాలరీలు ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగకుండా.. పనులు ఆగిపోవాలని ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు. కేంద్రం నుంచి రుణాలు రాకుండా.. కేసుల ద్వారా అడ్డుకుంటున్నాయని అన్నారు. అభివృద్ధి పనులకు నిధుల లోటు లేకుండా.. చెల్లింపుల సమస్యలు లేకుండా చేస్తున్నామని సీఎం అన్నారు.
94876 756090Ive been absent for some time, but now I remember why I used to adore this blog. Thank you, I will try and check back a lot more often. How regularly you update your web site? 861157
93638 170959You got a extremely wonderful website, Sword lily I observed it by way of yahoo. 996335
970028 804619Totally pent subject matter, appreciate it for selective info . 962518