వేసవి సెలవుల తర్వాత పాఠశాలల పునఃప్రారంభం తేదీని ఏపీ ప్రభుత్వం వాయిదా వేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూలై 4వ తేదీన కాకుండా ఒక రోజు తర్వాత.. జూలై 5వ తేదీన ప్రారంభమవుతాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖకు సూచనలు జారీ చేసింది. జూలై 4న ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా పాఠశాలల ప్రారంభాన్ని వాయిదా వేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.
జూలై 4న ప్రధాని మోదీ భీమవరంలో పర్యటించనున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా స్వాతంత్య్ర విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో ప్రధాని పాల్గొని అల్లూరికి ఘన నివాళి అర్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే పాఠశాలల పునః ప్రారంభ తేదీని వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో పాఠశాలలన్నీ జూలై 5న తెరుచుకోనున్నాయి.
547391 670275I take pleasure inside the comments on this weblog, it really gives it that community feel! 316747
35001 869007Yours is actually a prime example of informative writing. I believe my students could learn a good deal from your writing style and your content material. I could share this article with them. 320550