వైసీపీ కీలక నేతలతో సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. సమావేశానికి 26 జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, మంత్రులు హాజరయ్యారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఈ సమావేశం జరిగిందని తెలుస్తోంది. మంత్రులు, జిల్లాల్లోని నేతల మధ్య సమన్వయం ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రులు, జిల్లా అధ్యక్షులకు సీఎం సూచించారు.
ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమం ఎంత అందుతోందని తెలిపేలా ప్రణాళిక సిద్దం చేయాలని ఆదేశించారు. ఈక్రమంలో పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయం ఉండాలని చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీలో అసమ్మతి వర్గాలు, వర్గ విబేధాలకు చోటు ఉండకూడదని చెప్పినట్టు తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలు, సీఎం జిల్లా పర్యటనలు, టూర్ షెడ్యూల్ పై కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. మే 2 నుంచి ‘ఇంటింటికీ వైసీపీ’ కార్యక్రమం నిర్వహించాలని.. జూలై 8న వైసీపీ ప్లీనరీ నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారు.
647050 496574The website loading pace is incredible. 918717
199411 863297This internet site is often a walk-through rather than the details you wanted about it and didnt know who ought to. Glimpse here, and you will surely discover it. 112195