గౌతమ్ మన మధ్య లేడనే విషయాన్ని నమ్మడానికి ఇంకా మనసుకి కష్టంగానే ఉందని సీఎం జగన్ అన్నారు. నెల్లూరు గ్రామీణ మండలం కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘నేను లేకపోతే బహుశా గౌతమ్ రాజకీయాల్లోకి వచ్చుండేవాడు కాదేమో. కాంగ్రెస్ నుంచి నేను బయటికి వచ్చినప్పుడు 2009–10 ప్రాంతంలో ఒక యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ ఎంపీగా ఉన్న రాజమోహన్రెడ్డిగారు నావైపు ఉండేందుకు గౌతమ్ ఒత్తిడి పనిచేసిందని చెప్పాలి’.
‘అలా.. ప్రతి అడుగులోనూ గౌతమ్ నాకు తోడుగా ఉన్నాడు. నాకన్నా గౌతమ్ వయస్సులో సంవత్సరం పెద్దవాడయినా.. నన్నే అన్నగా భావించేవాడు. మేమంతా ఉన్నాం.. నువ్వు సాధించగలవని ప్రోత్సహించేవాడు. మంత్రిగా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు నిరంతరం శ్రమించాడు. గౌతమ్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. గౌతమ్ పేరు చిరస్థాయిగా నిలిచేలా సంగమ్ బ్యారేజ్కు మేకపాటి గౌతమ్ సంగమ్ బ్యారేజే అని పేరు పెడతాం’ అని అన్నారు.
530332 997279I will tell your pals to visit this web site. .Thanks for the article. 481926