ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరంను ఎక్కిన భారత మహిళలు కావ్య మాన్యపు మరియు పూర్ణ మలావత్ లను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. వారిద్దరు ఇటీవలే ఎవరెస్ట్ శిఖరం ఎక్కి సామాజిక సేవా కార్యక్రమాలను ప్రచారం చేస్తూ ఉన్నారు.
నిరుపేద బాలికలకు సాధికారత-విద్య-ఉన్నతి కల్పించేందుకు వారు చేస్తున్న కృషి ని మెగాస్టార్ ప్రశంసించాడు. ఇలాంటి మహిళలు ఎంతో మందికి ఆదర్శం అన్నట్లుగా మెగాస్టార్ వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి కావ్య మరియు పూర్ణ లతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో పాటు…. ప్రతి అమ్మాయికి ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది! ఈ ఇద్దరు యంగ్, డైనమిక్ మహిళలు డా.కావ్య మాన్యపు, అంతరిక్ష శాస్త్రవేత్త & పూర్ణ మాలావత్, ఎవరెస్ట్ అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు. నిరుపేద బాలికలకు సాధికారత-విద్య-ఉన్నతి కల్పించేందుకు వారి ‘ప్రాజెక్ట్ శక్తి’పై వారి ప్రయత్నాలను నేను అభినందిస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్తేరు వీరన్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
Proud of their achievement of scaling a 6012 mtrs Unclimbed mountain in Indian Himalayas for a great cause.
Let’s support them.https://t.co/aohnv8r25o@EverestPoorna #KavyaManyapu #ProjectShakthi#girlempowerment#girlsinSTEM #girlsinsports #weclimbsogirlscanread
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 3, 2022