ఉండవల్లి ప్రజా వేదిక కూల్చి వేతకు సంబంధించి కొంత వ్యతిరేకతను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్న మాట వాస్తవం. అయితే ముఖ్యమంత్రిగా ఇంకా నెల రోజుల పాలన పూర్తి చేసుకోని జగన్ మీద అప్పుడే విరుచుకు పడడం సబబు కాదన్న ధోరణిలో ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వుంది. మరోపక్క, సాధారణ ప్రజానీకంలోనూ వ్యతిరేకత ఎక్కువగానే కన్పిస్తున్నా.. అది ఇంకా మీడియాకి ఎక్కేదాకా రాలేదు.
ఇదిలా వుంటే, కూల్చివేతల వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ ఇప్పుడిప్పుడే పొలిటికల్ హీట్ పెంచుతోంది. చంద్రబాబు నివాసానికి ఈ రోజు అధికారులు నోటీసులు అంటించడంతో, అసలు ఆ నివాసం నిర్మితమయ్యిందీ, దానికి అనుమతులు వచ్చిందీ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనేనని తెలుగు తమ్ముళ్ళు తేల్చారు. ఇదొక్కటే కాదు, కృష్ణా కరకట్టకు ఆనుకుని నిర్మితమైన చాలా భవనాలకు సంబంధించి ఇదే పరిస్థితి.
వైఎస్ హయాంలోనే దాదాపు అన్ని భవనాలూ అనుమతులు పొందాయి. పైగా, అలా ఆయా భవనాలు అనుమతులను పొందడంలో ప్రస్తుత వైసీపీ నేత మల్లాది విష్ణు పాత్ర కూడా కీలకమన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారాల్ని తవ్వి తీసే పనిలో టీడీపీ నేతలున్నారు. ‘మా భవనం అక్రమంగా నిర్మితమైనది కాదు..’ అంటూ అనుమతుల తాలూకు వివరాల్ని ఆయా భవనాల యజమానులు తమ తమ భవనాల యెదుట పొందుపరుస్తుండడంతో అధికారులు షాక్కి గురవుతున్నారు.
‘చిన్న చిన్న ఉల్లంఘనలు తప్ప, మరీ తీవ్రస్థాయిలో నిబంధనల ఉల్లంఘన వుండకపోవచ్చు..’ అనే అభిప్రాయం కరకట్ట భవనాలకు సంబంధించి ఇప్పుడు వ్యక్తమవుతోంది. అధికారులు అనుమతలిచ్చినప్పుడు, అవి అక్రమ నిర్మాణాలు ఎలా అవుతాయంటూ కొందరు వైసీపీ నేతలే తమ అధినేత వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళుతున్నారట.
దాంతో, ఇప్పుడీ కూల్చివేతల వ్యవహారంలో అడ్డంగా ఇరుక్కుపోయామని అధికార పార్టీలో ఆందోళన బయల్దేరిందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. అక్రమ కట్టడాల లిస్ట్ తీసి, వీటన్నిటినీ కూల్చే ధైర్యముందా.? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంటే, అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందిప్పుడు.
18711 563911Oh my goodness! an incredible article dude. Thanks a ton However We are experiencing issue with ur rss . Dont know why Cannot enroll in it. Can there be any person discovering identical rss dilemma? Anyone who knows kindly respond. Thnkx 54067