నీళ్ళకి భాష ఏంటి.? ప్రాంతమేంటి.? అంటే, అది వేరే లెక్క. ఇక్కడి వ్యవహారం వేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీటి పంపకాల దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ నానా యాగీ చేశారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్. ప్రత్యేక రాష్ట్ర సాధన సంగతేమోగానీ, ఆ క్రమంలో తెలుగు ప్రజల మధ్య ఏ స్థాయిలో ఆయన విద్వేషాలు రగిల్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కానీ, ఇప్పుడు ఆయన స్వరం మార్చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలూ కలిసి ముందుకు నడవాలంటున్నారు. రెండు రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులు వుంటే చాలు.. రెండూ కలిసి ముందడుగు వేసెయ్యొచ్చా.? ఇదే తెలంగాణ రాష్ట్ర సాధన తాలూకు ముఖ్య ఉద్దేశ్యమా.? ఏమో మరి, తాజా పరిణామాలు తెలంగాణ రాష్ట్ర సాధనకు కొత్త అర్థం చెప్పేలానే వున్నాయి. అయినా, కేసీఆర్ ఏం చెబితే అదే కరెక్ట్. ఎందుకంటే, ఆయన తెలంగాణ జాతి పితగా మారిపోయారిప్పుడు.
ఒకప్పుడు ఏ జగన్ మీద అయితే రాళ్ళేయమని నేతలు ఆవేశంతో ఊగిపోయారో, ఆ తెలంగాణ రాష్ట్ర సమితికి ఇప్పుడు అదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పరిశుద్ధమైన మనస్సుతో కనిపిస్తుండడం ఆశ్చర్యరమే మరి. వైఎస్ రాజశేఖర్రెడ్డి జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేయడమే కాదు, తెలంగాణకు చెందాల్సిన నీటి వాటాల్ని ఆంధ్రప్రదేశ్కి దోచుకెళుతున్నారనీ ఇదే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు.
ఇప్పుడు ఆ వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమారుడు వైఎస్ జగన్కి శాలువాలు కప్పి, సత్కరించేసి.. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల గురించి వ్యూహాలు రచించేస్తున్నారు. గోదావరి నది నుంచి నీళ్ళను ఎత్తి పోసి, కృష్ణా నదిలో కలపాలన్నది కేసీఆర్ ఉవాచ. ఆ గోదావరిలోకి నీళ్ళెలా వస్తాయి.? అంటే, కాటన్ బ్యారేజీ ద్వారా సముద్రంలోకి వృధాగా పోతున్నాయ్ కదా.. ఆ నీళ్ళేనన్నమాట.
తెలంగాణ ఎగువ రాష్ట్రం.. ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రం. ఇక్కడ మిగులు జలాల వినియోగంపై హక్కు ఆంధ్రప్రదేశ్కి వుంటుంది. కానీ, అందులో వాటా కోసం కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారు. మరి, వైఎస్ జగన్ ఈ మాస్టర్ ప్లాన్ని ఆమోదిస్తారా.? అన్నది ఆసక్తికరం. కేసీఆర్ పొగడ్తలకు పొంగిపోతే, ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారిపోతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికే హైద్రాబాద్లో ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన భవనాల్ని తెలంగాణకు అప్పగించేసిన వైఎస్ జగన్, నీళ్ళనీ ఆంధ్రాకి దూరం చేసి, తెలంగాణకి అప్పగించేస్తారా.? వేచి చూడాల్సిందే.
839436 663066I surely did not realize that. Learnt some thing new these days! Thanks for that. 536561