ఇండియాకు కరోనా విదేశాల నుండి వచ్చిన వారితో వచ్చిన విషయం తెల్సిందే. విషయాన్ని వెంటనే పసిగట్టిన భారత ప్రభుత్వం ఇంకా పలు రాష్ట్ర ప్రభుత్వాలు విదేశాల నుండి వచ్చేవారిపై శ్రద్ద పెట్టడం జరిగింది. విమానాశ్రయంలోనే కరోనా ప్రాధమిక పరీక్షలు చేస్తున్నారు. విదేశాల నుండి వచ్చిన వందలాది మందికి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయడంతో పాటు అన్ని విధాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. విదేశాల నుండి వచ్చిన వారు వారికి వారు 14 రోజులు స్వీయ నిర్భదంలోకి వెళ్లాలంటూ ప్రభుత్వాలు సూచించాయి.
బాలీవుడ్ సింగర్ కనిక మాత్రం లండన్ నుండి వచ్చిన తర్వాత ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. అలాగే విమానాశ్రయంలో స్క్రీనింగ్ పరీక్షను కూడా లైట్ తీసుకుని చేయించుకోకుండా వెళ్లి పోయిందట. ఇప్పుడు ఆమెకు కరోనా పాజిటివ్ కేసుగా నమోదు అయ్యింది. లండన్ నుండి వచ్చిన తర్వాత ఆమె పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఇంకా రాజకీయ ప్రముఖులను కలవడంతో పాటు వారితో పార్టీలో పాల్గొంది. కనిక కపూర్ తండ్రి చెబుతున్నదాని ప్రకారం ఆమె మూడు పార్టీలకు హాజరు అయ్యిందని అందులో 350 నుండి 400 మంది పాల్గొని ఉంటారని అంటున్నారు.
ఆ మొత్తంలో సగానికి పైగా బాలీవుడ్కు చెందిన వారు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వసుందర రాజే ఇంకా పార్లమెంటు సభ్యులు కూడా ఉన్నారు. దాంతో ఇప్పుడు వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను కనిక కపూర్పై ఉత్తర ప్రదేశ్లో కేసు కూడా నమోదు అయ్యింది. కనిక కారణంగా కనీసం 50 మందికి అయినా కరోనా వ్యాప్తి చెంది ఉంటుందని వైధ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
368197 627978Its rare knowledgeable folks within this subject, nevertheless, you appear like theres more you are talking about! Thanks 389444
476008 531393Nice site, nice and easy on the eyes and great content too. Do you need several drafts to make a post? 850604
950729 422080Thank you for having the time to discuss this subject. I truly appreciate it. Ill stick a link of this entry in my internet site. 624018