జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమాగా చెప్తున్న బీజేపీకి ఇంటిపోరు తప్పడం లేదు. టికెట్లు ఆశించి భంగపడ్డ వారు ఆత్మహత్యల వరకూ వెళ్లిన వారు ఉన్నారు. బీజేపీ తీరును తప్పుబట్టిన వారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూకట్ పల్లి బీజేపీ కార్యాలయాన్ని బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. టికెట్ ఆశించి దక్కనివారు ఆగ్రహావేశాలకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది.
ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ముందుకెళ్తోంది. దుబ్బాక విజయం పార్టీ వర్గాల్లో ఉత్సాహం నింపింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో సీట్ల కోసం పోటీ ఎక్కువైంది. బీజేపీ నేతలు కూడా విజయంపై ధీమాగా ఉండడం ఇందుకు కారణం. అయితే.. గ్రేటర్ లో బీజేపీ టికెట్లు అమ్ముకుంటోందని.. మొదటి నుంచీ కష్టపడిన వారిని పక్కనపెట్టి.. మధ్యలో వచ్చిన వారికి టిక్కెట్లు ఇస్తోందని కొందరు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కూకట్ పల్లి బీజేపీ కార్యాలయంపై కార్యకర్తలు దాడికి దిగారు.
ఇటివలే నాచారం నుంచి టికెట్ ఆశించి భంగపడిన విజయలత ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం రేపింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నామినేషన్ల గడువు ముగియడంతో టికెట్లు దక్కని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్ టికెట్లను 30లక్షలకు అమ్ముకున్నారంటూ కూడా పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు హరీశ్ రెడ్డిని కలిసి కార్యకర్తలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
844514 982599Average In turn sends provides is the frequent systems that give the opportunity for ones how does a person pick-up biological, overdue drivers, what one mechanically increases the business. Search Engine Marketing 899248
145644 250721Hi there! Excellent stuff, please do tell me when you finally post something like that! 134603
865243 671219No more s . All posts of this qaulity from now on 283610
895975 171996 You ought to take part in a contest for one of the best blogs on the internet. I will recommend this internet site! 499997