గత ఏడాది కరోనా ఉదృతి కొనసాగుతున్నా కూడా హిందీ, తెలుగు మరియు తమిళం భాషల్లో బిగ్ బాస్ షో సాగింది. మూడు భాషల్లో కూడా మంచి సక్సెస్ ను దక్కించుకుంది. ఈ సంవత్సరంలో కూడా షో ను నిర్వహించాలని తెలుగు మరియు హిందీ మేకర్స్ భావించారు. కాని కరోనా సెకండ్ వేవ్ మరీ భయంకరంగా ఉందని అందుకే షో ను నిర్వహించక పోవడం మంచిదనే నిర్ణయానికి వచ్చారు. మలయాళం బిగ్ బాస్ సీజన్ 3 ని మాత్రం కొనసాగుతున్నారు. సెకండ్ వేవ్ ప్రారంభంకు ముందు షో ను ప్రారంభించడం జరిగింది.
కేరళలో కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. అయినా కూడా షోను కంటిన్యూ చేస్తున్నారు. ఈ సమయంలో షో నిర్వాకుల్లో మరియు సిబ్బందికి 8 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సదరు ఛానెల్ మరియు షో నిర్వహకులపై కేసు నమోదు అయ్యింది. దాంతో వెంటనే అధికారులు అక్కడకు వెళ్లి సెట్ ను ఖాళీ చేయించి అందరిని అక్కడి నుండి పంపించారు. అయినా కూడా సదరు ఛానెల్ మాత్రం షో కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే 95 రోజులు పూర్తి చేసుకున్న ఈ షో కు మోహన్ లాల్ హోస్టింగ్ చేస్తున్నాడు. మూడవ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ ను జూన్ 4న నిర్వహించబోతున్నట్లుగా వారు చెబుతున్నారు.
677341 443144Nice website. On your blogs quite interest and i will tell a buddies. 892726