బద్వేల్ వైకాపా ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణించడంతో ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేసేందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది. అక్టోబర్ 30న ఉప ఎన్నికలు నిర్వహించి నవంబర్ 2న ఫలితాలు ప్రకటించేలా ప్రకటన వచ్చింది. ఎన్నికల్లో వైకాపా తరపున చనిపోయిన ఎమ్మెల్యే కుటుంబానికి టికెట్ ఇవ్వడం జరిగింది. కనుక ఆ పోటీ నుండి తప్పుకుంటున్నట్లుగా ఇప్పటికే జనసేన ప్రకటించింది. తాజాగా తెలుగు దేశం పార్టీ కూడా అదే ప్రకటన చేసింది.
ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్లో చనిపోయిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు సీటు ఇస్తే పోటీకి దించే వారు కాదు. తెలుగు దేశం పార్టీ అదే పద్దతిని ఫాలో అవుతూ వస్తుంది. ఇప్పుడు అదే పద్దతిని పాటించాలనే నిర్ణయానికి తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో వచ్చింది. తాజాగా తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. జనసేన పార్టీ తో పాటు తెలుగు దేశం పార్టీ కూడా పోటీకి దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఇతర పార్టీలకు సంబంధించిన నిర్ణయం కూడా అదే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కూడా ఒక వేళ పోటీ నుండి తప్పుకుంటే ఖచ్చితంగా బద్వేల్ ఉప ఎన్నికల్లో ఏకగ్రీవం అవ్వడం ఖాయం.
989300 866701As soon as I found this web internet site I went on reddit to share some of the really like with them. 699600
789216 771669I located your weblog on yahoo and can bookmark it currently. carry on the good function. 328038