దేశంలో ఎక్కడా ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడూ ఎన్నికల కమిషన్ని ఉద్దేశించి అంత జుగుప్సాకరంగా మాట్లాడింది లేదు. అదేంటో, బూతులు మాట్లాడేందుకే కొందర్ని ప్రత్యేకంగా నియమించినట్లున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి. తన మంత్రి వర్గంలోనూ ‘బూతులు’ మాట్లాడటంలో స్పెషలిస్టులు వుండేలా చూసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
‘జుట్టు, వెంట్రుక..’ అనేవి సాధారణ పదాలే. ‘బొచ్చు’ అనే మాట కాస్తంత ఇబ్బందికరంగా వుంటుంది. ‘బొచ్చు పీకుతారా.?’ అంటే, మళ్ళీ తేడా వచ్చేస్తుంది. ‘నీయమ్మ మొగుడు’ అనే మాటని చాలా తేలిగ్గా వాడేస్తుంటారు మంత్రి కొడాలి నాని. అది ఆయనకి ఊతపదం అయిపోయింది ఈ మధ్య. ఏ విషయమ్మీద అయినా సరే మాట్లాడాల్సి వస్తే, ‘నీయమ్మ మొగుడు’ అంటూ విరుచుకుపడిపోతున్నారు ఈ మంత్రిగారు. ఒకసారి నోరు జారితే అదో లెక్క. కానీ, పదే పదే కొడాలి నాని ఇలా రెచ్చిపోతున్నారంటే, ఆయనకి ముఖ్యమంత్రి నుంచి ఏ స్థాయిలో ‘సపోర్ట్’ వుందో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్కుమార్ మీద, ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ‘కులం’ పేరుతో దూషణలకు దిగిన విషయం విదితమే. ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు, ఆఖరికి స్పీకర్ కూడా రమేష్కుమార్పై అవాకులు చెవాకులు పేలారు. ఆ ప్రసహనం ఇంకా ముగిసిపోలేదు. తాజాగా కొడాలి నాని, ‘రమేష్ కుమార్ ఏం పీకుతాడు.? బొచ్చు పీకుతాడా.?’ అంటూ నోరు పారేసుకున్నారు. నిజానికి, రాయడానికి వీల్లేని భాష ఇది. కానీ, ఎలక్ట్రానిక్ మీడియా పుణ్యమా అని సెన్సార్ లేకుండానే నేతల బూతులు బయటకు వచ్చేస్తున్నాయి. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోలేని భాషని ఉపయోగిస్తున్నారు అధికార పార్టీ నేతలు.
ఇప్పుడు రమేష్కుమార్, రేప్పొద్దున్న కనగరాజ్.. ఎవరికైనా ఇదే గతి. ఎందుకంటే, వైసీపీ చెప్పినట్లే అధికారులు నడుచుకోవాలి.. నడుచుకోకపోతే అంతే సంగతులు. ఎల్వీ సుబ్రహ్మణ్యం విషయంలో ఏం జరిగిందో అందరం చూశాం. ఎన్నికల కమిషన్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన, రాజ్యాంగ బద్ధమైన సంస్థ. కానీ, అధికార పార్టీ నేతలకి ఆ మాత్రం కూడా ఇంగితం లేకపోవడాన్ని ఏమనుకోవాలి.?
228355 558743I recognize there is a great deal of spam on this web site. Do you want aid cleaning them up? I may possibly support in between courses! 219684