రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో సందిగ్ధం ఇంకా తొలగిపోవడంలేదు. గత కొద్ది రోజులుగా ఈ పదవిలో ఎవరూ లేకపోవడంతో ప్రభుత్వం కూడా కాస్త ఇబ్బంది పడుతున్నట్లే కన్పిస్తోంది. నిమ్మగడ్డ రమేష్కుమార్పై ‘కులం’ ముద్ర వేసి మరీ ఆయన్ని ఎన్నికల కమిషనర్ పదవి నుంచి ప్రభుత్వ పెద్దలు తొలగించిన విషయం విదితమే. ‘ఎన్నికల సంస్కరణలు’ పేరుతో ఆర్డినెన్స్ తీసుకొచ్చినా, సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ‘చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్కుమార్..’ అంటూ అసహనం వ్యక్తం చేయడంతో, ఈ వ్యవహారం రాజకీయంగా వేడిని రాజేసింది.
కాగా, హైకోర్టు నుంచి నిమ్మగడ్డ ఊరట పొందారు. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ చెల్లకుండాపోయింది. ఆ వెంటనే నిమ్మగడ్డ, ‘చార్జ్’ తీసుకున్నట్లుగానే వ్వవహరించారు. అయితే, నిమ్మగడ్డ స్పీడుకి బ్రేకులేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. అయితే, అక్కడా ఏపీ ప్రభుత్వానికి శుభ శకునాలు ఎదురుకావడంలేదు. నిమ్మగడ్డ పునర్నియామకంపై ‘స్టే’ విధించాలంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరినా, ‘స్టే ఇవ్వలేం’ అని ఇప్పటికే ఓసారి తేల్చేసిన సుప్రీంకోర్టు, తాజాగా ఈ రోజు మరోసారి ‘స్టే’కు నిరాకరించింది. అయితే, కేసు విచారణ మాత్రం కొనసాగనుంది. విచారణ మూడు వారాలకు సుప్రీంకోర్టు వాయిదా వేయడంతో, ఈలోగా నిమ్మగడ్డ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకోనుంది.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
ఎక్కువ రోజులు ఎన్నికల కమిషనర్ పదవిని ఖాళీగా వుంచడం ప్రభుత్వానికి సంకటంగానే భావించాలేమో. స్థానిక ఎన్నికల ప్రక్రియను కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేష్కుమార్, ఈ క్రమంలో ప్రభుత్వాన్ని సంప్రదించకపోవడమే అసలు వివాదానికి కారణం. ఈ విషయంలో నిమ్మగడ్డ తీరుని సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది. కానీ, నిమ్మగడ్డ తొలగింపుకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఊరట పొందలేకపోతోంది. ఇటీవల నిమ్మగడ్డ, బీజేపీ నేత సుజనా చౌదరిని హైద్రాబాద్లోని ఓ హోటల్లో కలవడం పెను దుమారానికి కారణమైన విషయం విదితమే.
402251 647381This plot doesnt reveal itself; it has to be explained. 537552