Switch to English

ఆస్పత్రుల తీరు మారదా.. శవాల మీద పైసలు ఏరుకోవడమేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

మనిషికి ప్రాణం మీద ఉన్నంత మమకారం దేని మీదా ఉండదు. సరిగ్గా ఇదే పాయింట్ పై ఆధారపడి పలు ఆస్పత్రులు వ్యాపారం చేస్తున్నాయి. వైద్యం కోసం తమ దగ్గరకు వచ్చినవారి నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి. కొన్ని ఆస్పత్రులైతే శవాల మీద కూడా పైసలు ఏరుకుంటూ పవిత్రమైన వైద్య వృత్తి విలువలకు నిలువునా పాతరేస్తున్నాయి. డబ్బులు కట్టిన తర్వాతే శవాన్ని తీసుకెళ్లాని తేల్చి చెబుతున్నాయి.

ప్రపంచం అంతా ఓవైపు కరోనాతో అల్లకల్లోలం అవుతుండగా.. ఇటీవలే ఈ చికిత్సకు అనుమతి రావడంతో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు మాత్రం తమ దందాతో రెచ్చిపోతున్నాయి. రోజుకు ఏకంగా లక్షల్లో ఫీజులు గుంజుతూ బాధితుల నడ్డి విరుస్తున్నాయి. ప్రతిరోజూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. సామాన్యులకే కాదు.. కరోనా బారిన పడిన డాక్టర్లకు కూడా ఈ ఇబ్బందులు తప్పడంలేదు.

ఫీవర్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ కు హైదరాబాద్ చాదర్ ఘాట్ లోని తుంబే ఆస్పత్రి ఒక్కరోజుకు లక్షన్నర బిల్లు వేయగా.. తాజాగా ఏఐజీ ఆస్పత్రి మరో మహిళా డాక్టర్ కు ఇదే తరహాలో షాక్ ఇచ్చింది. కరోనా పాజిటివ్ తో తండ్రితో కలిసి ఆమె ఆస్పత్రిలో చేరారు. ఆమెకు ఎలాంటి కరోనా లక్షణాలూ లేవు. అయినప్పటికీ ఆక్సిజన్ పెట్టినట్టుగా, ఐవీలు ఇచ్చినట్టుగా లక్షల్లో బిల్లు వేశారని.. దీనిపై ప్రశ్నించడంతో బలవంతంగా డిశ్చార్జి చేస్తున్నారంటూ ఆమె తీసిన సెల్పీ వీడియో బుధవారం సంచలనమైంది.

నిజానికి ఏదైనా రోగం వచ్చి కార్పొరేట్ ఆస్పత్రికి వెళితే ఆస్తులు అమ్ముకోక తప్పదనే వ్యాఖ్యలు వినిపించేవి. కానీ తాజాగా కరోనా చికిత్స విషయంలో అవి అనుసరిస్తున్న తీరు చూస్తుంటే ఆస్తులు అమ్ముకున్నా కూడా కట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. అంత భారీగా బిల్లులు వేసి దారుణంగా దోచుకుంటున్నాయి. లాక్ డౌన్ కాలంలో ఆస్పత్రులు మూసి ఉంచడంతో అప్పటి నష్టాలను కూడా ఇప్పుడు రికవరీ చేసుకునే దిశలో ఆయా ఆస్పత్రులు భారీగా దండుకుంటున్నాయని అంటున్నారు. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతి ఇవ్వనంత కాలం అంతా బాగానే ఉంది.

అయితే, కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్సకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతే.. అప్పటివరకు సైలెంటుగా ఉన్న ఆస్పత్రులు ఒక్కసారిగా జూలు విదిల్చాయి. కరోనా చికిత్సకు దేనికెంత చార్జి వేయాలో సర్కారు స్పష్టం చేసినా.. వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. సాక్షాత్తు హైకోర్టు సైతం ఈ విషయంలో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల తీరును తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తున్న ఆస్పత్రులపై కొరడా ఝలిపించాల్సిందేనని సర్కారుకు స్పష్టంచేసింది. అయితే, ఎవరేం చెప్పినా మాకేంటి అనే రీతిలో ప్రైవేటు ఆస్పత్రులు తమ దందా మాత్రం ఆపడంలేదు. ఈ విషయంలో సర్కారు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప వాటి తీరు మారదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...