టెన్త్ పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరానికి పదో తరగతి పరిక్షలు రద్దు చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేసింది. ఈ మేరకు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘పరీక్షల నిర్వహణ కోసం కలెక్టర్ల స్థాయి నుంచి పోలీసులు, వివిధ విభాగాలు, తల్లిదండ్రులు కలిసి పని చేయాలి. విద్యార్ధుల ఆరోగ్యంతో పాటు అన్ని పరిస్థితులనూ బేరీజు వేసుకుని పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించాం. ఈ మేరకు సీఎం జగన్ పరిక్షలు రద్దు చేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర హోంశాఖ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నాం. ఫెయిల్ అయిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులను కూడా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నాం’ అన్నారు.
పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని భావించింది. ఇందుకు జూలై 10 నుంచి 17వరకూ తేదీలను కూడా ప్రకటించింది. 11 పేపర్లను 6కు కుదించారు కూడా. పరీక్ష కేంద్రాలు రెట్టింపు చేసి.. అన్ని చర్యలు తీసుకున్నారు. కానీ.. ప్రస్తుతం కరోనా పరిస్థితులు తీవ్రం కావడంతో రద్దు నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు పదో తరగతి పరిక్షలు రద్దు చేశాయి. అంతేకాకుండా అక్కడి విద్యార్ధులకు గ్రేడ్ లు కూడా ఇచ్చేశాయి.
554714 715500I real pleased to locate this website on bing, just what I was searching for : D too saved to bookmarks . 413610
906163 647367Thanks for the write up! Also, just a heads up, your RSS feeds arent working. Could you take a appear at that? 34080
661712 337351Dude. You mind if I link to this post from my own internet site? This really is just too awesome. 775929