పోయిన సంవత్సరం సంక్రాంతికి ఎఫ్ 2 చిత్రంతో ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ను దక్కించుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 చిత్రం స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నాడు. తన సొంత ప్రాంతంలో ప్రస్తుతం తన టీంతో కలిసి ప్రశాంత వాతావరణంలో స్క్రిప్ట్ వర్క్లో అనీల్ ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనీల్ రావిపూడి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం ఎఫ్ 3 చిత్రం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాం. గత చిత్రంతో పోల్చితే ఈ సినిమాలో మరింత ఎంటర్టైన్మెంట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నామని అన్నాడు. ఇక ఎఫ్ 2లో నటించిన వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్లు ఈ సినిమాలో నటించబోతున్నట్లుగా ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఇద్దరు హీరోయిన్స్ కూడా ఎఫ్ 3లో కనిపించడం అనుమానమే అంటూ వచ్చిన వార్తలకు అనీల్ ఈ సమాధానంతో క్లారిటీ ఇచ్చాడు.
ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటీ అంటే ఎఫ్ 3 అంటే మొదటి నుండి కూడా ముగ్గురు హీరోలు అంటూ ప్రచారం జరుగుతోంది. కాని తాజాగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రెడీ అయిన కథ వరకు మూడవ హీరో అవసరం రాలేదు. రెండవ పార్ట్లో ఏమైనా మరో హీరో అవసరం అవుతాడో చూడాలి. ప్రస్తుతానికి నేను కూడా మూడవ హీరో విషయంలో ఏం చెప్పలేను అంటూ సస్పెన్స్లో ఉంచాడు. ఎఫ్ 3లో మూడవ హీరోగా మహేష్బాబు నటించబోతున్నాడు అంటూ వచ్చిన వార్తలను ఆయన కొట్టి పారేశాడు.
138789 772819I like this weblog so much, saved to fav. 699125
94024 752072There is noticeably a bundle to uncover out about this. I assume you created certain good factors in options also. 776748
532717 268620Some actually superb information , Sword lily I identified this. 255417