ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వంలో మొన్నటి వరకూ మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఇటివల రాజ్యసభకు ఎన్నికై ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. దీంతో వారు రాజీనామా చేసిన మంత్రి పదవుల స్థానాలకు సీఎం జగన్ మరో ఇద్దరిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వారిలో ఒకరు సిదిరి అప్పలరాజు కాగా.. మరొకరు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అనే విషయం తెలిసిందే. వీరిద్దరితో ఈరోజు రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు.
సీఎం జగన్ వారిద్దరికీ మంత్రి పదవులు కేటాయించారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్.. నిర్వర్తించిన శాఖలను అదే సామాజికవర్గాల వారికి కేటాయించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రుల శాఖలు మారాయి. పిల్లి సుభాస్ చంద్రబోస్ కు ఉన్న డిప్యూటీ సీఎం హోదాను మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు కల్పించారు. దీంతోపాటు ఆయన శాఖను మార్చారు. ఇప్పటి వరకూ ఆయన నిర్వహించిన రోడ్లు, భవనాల శాఖను మంత్రి శంకర్ నారాయణకు కేటాయించారు. శంకర్ నారాయణ ఇప్పటివరకూ చూస్తున్న బీసీ సంక్షేమ శాఖను కొత్తగా మంత్రి అయిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు కేటాయించారు. మోపిదేవి నిర్వహించిన మత్స్య, పశుసంవర్ధక శాఖను సిదిరి అప్పలరాజుకు కేటాయించారు.
637357 462989Woh I really like your posts , bookmarked ! My wife and i take issue along along with your last point. 934288