Anasuya: ఒక ప్రముఖ చానెల్ అవార్డుల వేడుకలో అలనాటి నటీమణులైన సావిత్రి, జమున, శ్రీదేవి, సౌందర్య నటించిన కొన్ని పాటలను రీ-క్రియేట్ చేశారు అనసూయ (Anasuya). వారెలాంటి వేషధారణల ఉన్నారో అలాంటి మేకోవర్ లోనే కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే.. దీనిపై ఓ నెటిజన్ కామెంట్ చేయగా ఆమె రిప్లై ఇచ్చారు.
‘ఎక్స్ పోజ్ చేసినంత తేలిక కాదు సావిత్రిలా నటించడమంటే’ అని కామెంట్ చేయగా.. ‘కరెక్ట్ గా చెప్పారండీ. సావిత్రి అమ్మలా యాక్ట్ చేయడం ఎవరి తరం కాదు. నేను ట్రిబ్యూట్ ఇచ్చానంతే. అలాగే.. ఎక్స్ పోజ్ చేయడం కూడా తేలిక కాదు. శారీరకంగా.. మానసికంగా చాలా ప్రిపేర్ అవ్వాలి. మనం చేసే పనిలో నిబద్ధత, దృఢ సంకల్పంతో చేయాల’ని అన్నారు.
మరోవైపు.. అనసూయ మేకోవర్ కు చాలామంది నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. సావిత్రిలా బాగా సెట్ అయ్యారని.. అన్ని గెటప్పుల్లో బాగున్నారంటూ కామెంట్స్ వచ్చాయి. ప్రస్తుతం అనసూయ పుష్ప-2లో నటిస్తున్నారు.
I feel fortunate to have been given this opportunity to give a tribute to these legendary actresses through my performance.. 😇🙏🏻#Savithramma #JamunaGaru #SrideviGaru #SoundaryaGaru
Don’t miss #ZeeKutumbamAwards2023 this evening #6pmOnwards only on @zeetelugu ❤️ pic.twitter.com/S1HDmgUkrD
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 29, 2023