Anand Mahindra: ఆసియా కప్ (Asia Cup) ఫైనల్లో తన అద్భుతమైన బౌలింగ్ తో భారత్ కు తిరుగులేని విజయాన్ని అందించాడు సిరాజ్ (Siraj) . పైగా.. తన ఫీజును కొలంబో గ్రౌండ్ సిబ్బందికి ఇచ్చి తన ఉన్నత మనసును సైతం చాటుకున్నాడు. దీంతో సిరాజ్ ను సర్వత్రా కీర్తిస్తున్నారు. వీరిలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సైతం ఉన్నారు.
ఈక్రమంలో ఆయనకు ఓ నెటిజన్ విజ్ఞప్తి.. అందుకు ఆయన రిప్లై ఆకర్షిస్తున్నాయి. ‘క్రికెట్లో మన ప్రత్యర్ధులపై నేనెప్పుడూ బాధ పడలేదు. కానీ.. ఈసారి ఏదో శక్తి వారిపై ప్రదర్శించినట్టైంది. మహ్మద్ సిరాజ్ నువ్వొక మార్వెల్ అవెంజర్. కొలంబో గ్రౌండ్ సిబ్బందికి రివార్డు ప్రకటించడం అంటే క్లాస్. మంచి మనసు ఉంటేనే ఇలా చేయగలర’ని ట్వీట్ చేశారు. దీంతో ఓ నెటిజన్.. ’సర్.. సిరాజ్ కు ఓ ఎస్ యూవీ ఇవ్వండి’ అని రీట్వీట్ చేశాడు.
దీనికి స్పందనగా.. 2021లోనే సిరాజ్ కు మహీంద్రా థార్ ఇచ్చినట్టు గుర్తు చేశారు. ఆస్ట్రేలియాపై టెస్టు గెలిచిన తర్వాత ఆయన ఈ బహుమతి అందించారు.