అఖిల్ ప్రస్తుతం తన నాల్గవ చిత్రం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. అఖిల్ ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలు కూడా నిరాశ పర్చడంతో ఈ సినిమాపై చాలా అంచనాలే పెట్టుకున్నాడు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల సిద్దం అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా వేశారు. ఈ సమయంలోనే అఖిల్ 5వ సినిమా గురించి ప్రముఖంగా మీడియాలో వార్తలు వచ్చాయి.
నితిన్ నిర్మాణంలో అఖిల్ 5వ చిత్రం తెరకెక్కబోతుందని ప్రచారం జరిగింది. ఆ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ వార్తలన్నీ కూడా పుకార్లే అన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే దర్శకుడు సురేందర్ రెడ్డి అఖిల్తో సినిమాకు ఏమాత్రం ఆసక్తిగా లేడట. ప్రస్తుతం ఆయన దృష్టి అంతా కూడా స్టార్ హీరోలపైనే ఉందట.
అఖిల్తో సినిమా చేస్తే టైర్ 2 హీరోల దర్శకుడిగా మారిపోయే ప్రమాదం ఉందని అందుకే అఖిల్తో సినిమా చేయాలని ఆఫర్ వచ్చినా కూడా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అఖిల్తో నితిన్ మూవీ అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి కాంబో ఎప్పుడు ఉంటుందనే విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. సైరా చిత్రం తర్వాత సురేందర్ రెడ్డిని ఎవరు పట్టించుకోవడం లేదు. కాని ఆయన మాత్రం స్టార్ హీరోల సినిమాలే చేస్తానంటూ పట్టుబట్టి కూర్చున్నాడు.
283725 303602I recognize there is certainly a great deal of spam on this blog. Do you want help cleansing them up? I may aid in between classes! 403302
751781 976343Hmm is anyone else having difficulties with the images on this blog loading? Im trying to figure out if its a issue on my end or if its the blog. Any responses would be greatly appreciated. 228076