ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి టీడీపీకి ఝలక్ ఇచ్చారు. ఇన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న ఆయన అకస్మాత్తుగా వైఎస్సార్ సీపీకి జైకొట్టారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో గంగుల ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు.
నంద్యాల ఎంపీ టికెట్ కేటాయిస్తామన్న సీఎం చంద్రబాబు హామీ మేరకు అప్పట్లో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు కృషి చేశారు. అయితే, తాజాగా జరిపిన ఎంపీ టికెట్ కేటాయింపులో చంద్రబాబు గంగుల ప్రతాప్ రెడ్డికి మొండిచేయి చూపారు. దీంతో అప్పటినుంచి అసంతృప్తితో ఉన్న ఆయన సరిగ్గా సమయం చూపి బాబుకు షాక్ ఇచ్చారు.
దీంతో మంత్రి అఖిలప్రియకు ఇబ్బందులు తప్పవనే విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అఖిలప్రియ బరిలోకి దిగగా.. వైఎస్సార్ సీపీ నుంచి గంగుల ప్రభాకర్ రెడ్డి కుమారుడు గంగుల బిజేంద్రరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకు గంగుల కుటుంబం వేర్వేరు పార్టీల్లో ఉండటంతో వారి ఓట్లు చీలిపోవడం ద్వారా తన గెలుపునకు ఢోకా ఉండదని అఖిల భావించారు.
కానీ పోలింగ్ కు వారం రోజుల ముందు జరిగిన ఈ హఠాత్ పరిణామం ఆమెకు మింగుడుపడంలేదని సమాచారం. గంగుల కుటుంబం అంతా ఒక్కటై బిజేంద్ర గెలుపునకు కృషి చేయాలని నిర్ణయించుకోవడంతో ఒక్కసారిగా ఇక్కడ సమీకరణాలు మారిపోయాయి. గంగుల కుటుంబానికి స్థానికంగా గట్టి పట్టు ఉండటం, ఎస్వీ మోహన్ రెడ్డి కూడా వైఎస్సార్ సీపీలోకి తిరిగి రావడంతో అఖిల చెమటోడ్చక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
అసలు ఆళ్లగడ్డ పేరు చెప్పగానే భూమా, గంగుల, ఎస్వీ మోహన్ రెడ్డి కుటుంబాలే గుర్తుకొస్తాయి. ఈ మూడు కుటుంబాలకు చెందినవారే ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ముఖ్యంగా భూమా, గంగుల కుటుంబాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో గంగుల తిమ్మారెడ్డి రెండుసార్లు, ఆయన కుమారుడు గంగుల ప్రతాప్ రెడ్డి మూడు సార్లు, ఎస్వీ సుబ్బారెడ్డి రెండు సార్లు, భూమా శేఖర్ రెడ్డి ఒకసారి, భూమా నాగిరెడ్డి రెండుసార్లు, శోభానాగిరెడ్డి ఐదుసార్లు, అఖిలప్రియ ఒకసారి ఎన్నికయ్యారు.
2014 ఎన్నికల్లో పోలింగ్ కు ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అయినప్పటికీ, పోలింగ్ కొనసాగించగా.. గంగుల ప్రభాకర్ రెడ్డిపై శోభానాగిరెడ్డి విజయం సాధించారు. తర్వాత నిర్వహించి ఉప ఎన్నికల్లో ఆమె కుమార్తె అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం తండ్రి నాగిరెడ్డితో కలిసి ఆమె టీడీపీలో చేరారు.
గుండెపోటుతో నాగిరెడ్డి కన్నుమూయడంతో నంద్యాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. అయితే, నియోజకవర్గంలో అఖిల అనుసరించిన వైఖరితో చాలామంది సీనియర్లు కినుక వహించారు. అందరినీ కలుపుకునిపోవడంలో ఆమె విఫలమయ్యారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆమెకే చంద్రబాబు టికెట్ ఇచ్చారు.
గంగుల ప్రతాప రెడ్డి ఎలాగూ టీడీపీలోనే ఉన్నారు కాబట్టి, గంగుల కుటుంబం ఓట్లు చీలిపోతాయని, ఫలితంగా తాను గెలుస్తానని అఖిల భావించారు. అంతేకాకుండా ప్రచారంలో ఆమె అమ్మ సెంటిమెంట్ తెరపైకి తెచ్చారు. మీరు వేసే ఓటు తనకు కాదని, శోభమ్మకు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గంగుల ప్రతాపరెడ్డి టీడీపీని వీడి వైఎస్సార్ సీపీ అభ్యర్థి గంగుల బిజేంద్రారెడ్డికి మద్దతు ప్రకటించడంతో అఖిలప్రియ గెలుస్తారా లేదా అనేదానిపై జోరుగా చర్చ జరుగుతోంది.
150583 729968I like this site because so considerably utile stuff on here : D. 652574
800866 882796I actually prize your function , Excellent post. 979241
955281 538014This douche bag loves his illegal bretheren because hes a itiaen of the world and we need to be ashamed of ourselves I got news for you Asswipe get your asswiping ass back to the craphole exactly where you came from with all of your illegal beaners 173950