కరోనా పాజిటివ్ ప్రస్తుతం భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. రోజుకి దేశవ్యాప్తంగా దాదాపు 25,000 పైగా కేసులు నమోదవుతున్నాయి. వీరిలో సామాన్య ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కూడా ఉంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ కు కరోనా సెగ బలంగా తాకింది. నిన్న రాత్రి బిగ్ బి అమితాబ్ బచ్చన్, తన కొడుకు అభిషేక్ బచ్చన్ లకు కరోనా పాజిటివ్ అన్న వార్త తెల్సిందే. అమితాబ్ ను నానావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. వీరితో పాటు అభిషేక్, ఐశ్వర్యల గారాల పట్టి ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్ అని తెలిసింది.
ఇక బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఫ్యామిలీకి కూడా కరోనా సెగ తాకింది. అనుపమ్ ఖేర్ తల్లి దులారి ఖేర్, సోదరుడు రాజు ఖేర్, మరియు మరో ఇద్దరు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ అని అనుపమ్ స్వయంగా వెల్లడించాడు. తనకు మాత్రం టెస్ట్ లో నెగటివ్ అని వచ్చిందట.