Adipurush : ప్రభాస్ హీరోగా రూపొందిన ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యింది. గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా ముచ్చట్లు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సినిమా విడుదలకు రెడీ అయ్యింది. మరో వారం రోజుల్లో సినిమా విడుదల కాబోతుండగా తిరుపతిలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.
ఆదిపురుష్ సినిమా యొక్క తిరుపతి ప్రీ రిలీజ్ ఈవెంట్ యొక్క ఏర్పాట్ల బాధ్యతలను ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన దగ్గరుండి కార్యక్రమ ఏర్పాట్లు మరియు కార్యక్రమం యొక్క సెట్ ను ఏర్పాటు చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ప్రీ రిలీజ్ కి ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. కానీ ఒకే ఒక్క విషయంలో అభిమానులకు నిరాశ తప్పదేమో అనిపిస్తుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గాను యాంకర్ గా సుమ కాకుండా ఝాన్సీ వ్యవహరించబోతుంది.
గత కొన్ని రోజులుగా సుమ హాలీడేస్ కోసం విదేశాల్లో ఉన్నారు. కనుక ఆదిపురుష్ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె కనిపించదని అంటున్నారు. సుమ ఉంటే కార్యక్రమం డబుల్ హిట్ అవుతుంది.. మరి ఝాన్సీ గారు ఏం చేస్తారో చూడాలి.