ఏపీ హైకోర్టు ఇద్దరు ఐఏఎస్ లపై సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కింద ఇద్దరు ఐఏఎస్ లకు వారం రోజుల జైలు శిక్ష విధించింది. 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ ఏప్రిల్లో న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈక్రమంలో ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్, ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవి చౌదరికి వారం రోజులపాటు జైలు శిక్ష విధించింది.
న్యాయస్థానం ఉత్తర్వులు అమలు చేయాలంటూ పలుమార్లు ఆదేశించినప్పటికీ బేఖాతరు చేసినందుకు కోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది. హైకోర్టులో నేటి విచారణకు ఉన్నతాధికారులు ఇద్దరు వ్యక్తిగతంతా హాజరయ్యారు. విచారణ సందర్భంగా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం.
723508 121962I really glad to find this internet site on bing, just what I was looking for : D as effectively saved to favorites . 367324