సిరీస్ ఎంపికై ఒక్క మ్యాచైనా ఆడే అవకాశం రాకపోతే ఎంత బాధగా ఉంటుందో తనకు తెలుసని భారత్-ఏ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. శ్రీలంకలో పర్యటించే భారత యువజట్టుకు కోచ్ గా ఉన్న ద్రావిడ్ తాను గతంలో ఎదుర్కొన్న పరిస్థితులపై మాట్లాడాడు. ‘కోచ్ గా భారత్-ఏకు ఎంపికైన ప్రతిఒక్కరికీ ఆడే అవకాశం ఇస్తానని ముందే చెప్పేవాడిని. 11మంది కాదు.. 15 మందీ ఆడతారని ముందే చెప్పేవాడిని. అండర్-19లో ప్రతి మ్యాచ్ కూ మార్పులుంటాయి’.
‘ఓ టోర్నీలో 700-800 పరుగులు చేసి భారత్-ఏకు ఎంపికై ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోతే సెలక్టర్ల దృష్టిని ఆకర్షించలేరు. రిజర్వ బెంచిపై కూర్చుంటేనో.. గల్లీ క్రికెట్ ఆడితేనో గొప్ప క్రికెటర్లు కాలేరు. ఆటను ప్రేమించాలి. ఇప్పుడున్న వసతులు మాకు లేవు. ఫిట్ నెస్ సౌకర్యాలు, ట్రైనర్లు తక్కువ. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాకు ఫిట్ నెస్ ట్రైనర్లు ఉండేవారు. వారి నుంచి సమాచారం తక్కువ వచ్చేది. ఇప్పుడు అవకాశాలు పెరిగాయి’ అన్నాడు.
193243 243686Aw, this was a extremely good post. In thought I wish to put in writing like this moreover – taking time and precise effort to make an superb article but what can I say I procrastinate alot and under no circumstances seem to get something done. 875456
534955 249121Beneficial details. Fortunate me I discovered your web internet site by chance, and Im surprised why this twist of fate didnt happened earlier! I bookmarked it. 632075