గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. గ్రేటర్ ఓటరు, హంగ్ తీర్పునిచ్చారు. ఏ పార్టీకీ గ్రేటర్ మేయర్గిరీ దక్కించుకునే స్పష్టమైన మెజార్టీ రాలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ అవతరించింది. ఆ తర్వాతి స్థానం భారతీయ జనతా పార్టీదే. మజ్లిస్ పార్టీ తన స్థానాల్ని దాదాపు నిలబెట్టుకుంది.. ఒకటి రెండు స్థానాల్ని కోల్పోయింది. ఎలా చూసినా, గ్రేటర్ ఎన్నికల్లో నైతిక గెలుపు మాత్రం భారతీయ జనతా పార్టీదే. అదే సమయంలో నైతిక ఓటమిని చవిచూసింది తెలంగాణ రాష్ట్ర సమితి. గత ఎన్నికల్లో 99 డివిజన్లను గెలుచుకున్న టీఆర్ఎస్, ఈసారి వాటిల్లో చాలా డివిజన్లను కోల్పోవడం గమనార్హం.
అధికారాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి టీఆర్ఎస్ గెల్చుకున్న స్థానాల సంఖ్య 60కి చేరలేకపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు. ఇంకో నాలుగైదు రోజులు ఎన్నికల ప్రచారం కోసం సమయం వుండి వుంటే.. టీఆర్ఎస్ని బీజేపీ ఇంకా దారుణంగా ఓడించేదేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పుడు టీఆర్ఎస్ ఏం చేస్తుంది.? గ్రేటర్ మేయర్ పీఠం ఎలా ఎక్కుతుంది.? అన్న విషయమై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. ‘నిస్సిగ్గుగా ఎక్స్ అఫీషియో ఓట్లను టీఆర్ఎస్ వినియోగించుకోబోతోంది..’ అన్నది బీజేపీ విమర్శ. నిజానికి, ఇప్పుడే టీఆర్ఎస్.. నైతికతను చాటుకోవాల్సి వుంది.
ఎక్స్ అఫీషియో ఓట్లతో మేయర్గిరీని టీఆర్ఎస్ సొంతం చేసుకుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. అలాగని మజ్లిస్ పార్టీ సహకారం తీసుకోలేదు. ఇక, ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. గ్రేటర్ మేయర్ పీఠం టీఆర్ఎస్దే.. కానీ, టీఆర్ఎస్కి అటు మజ్లిస్ వైపు నుంచీ, ఇటు బీజేపీ వైపునుంచీ చుక్కలు కనిపిస్తాయి ఇకపై. ప్రధానంగా పాతబస్తీపై బీజేపీ చేసే రాజకీయాల్ని సమర్థించలేక, తిప్పికొట్టలేక టీఆర్ఎస్ పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇంకోపక్క, ‘నెల రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం..’ అని ఎన్నికల ప్రచారంలో నినదించిన మజ్లిస్ పార్టీ, టీఆర్ఎస్ని మేయర్ పీఠం నుంచి కిందకి లాగేయడానికి రోజుల సమయమే తీసుకోవచ్చు కూడా. ఏమో, తెలంగాణ రాజకీయాల్లో ఏ క్షణాన ఏమైనా జరగొచ్చు. బొటాబొటీ మెజార్టీతో గట్టెక్కితే.. ఆ ఫలితాలెలా వుంటాయో టీఆర్ఎస్కే బాగా తెలుసు.
508958 588758I dugg some of you post as I cogitated they were quite beneficial invaluable 107503