యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి కనీసం ఫస్ట్లుక్ కూడా విడుదల చేయలేదు. సినిమా ఇప్పటి వరకు సగమే చిత్రీకరణ పూర్తి అయ్యిందంటున్నారు. రెండేళ్లుగా ఏం చేస్తున్నట్లు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ప్రభాస్ ఫ్యాన్స్ ఫస్ట్లుక్ విడుదల చేయడం లేదు అంటూ యూవీ క్రియేషన్స్కు వ్యతిరేకంగా వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టారు.
ఫ్యాన్స్ తీరుతో యూవీ క్రియేషన్స్ వారు స్పందించారు. ప్రభాస్ మూవీ అప్డేట్ అతి త్వరలోనే ఇస్తామంటూ ప్రకటించారు. అన్నట్లుగానే యూవీ క్రియేషన్స్ ప్రభాస్ 20 మూవీ అప్డేట్తో రెడీ అయినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మరో వారం రోజుల్లోనే సినిమా ఫస్ట్లుక్ విడుదల చేయబోతున్నారు. అదే సమయంలో సినిమాకు సంబంధించిన టైటిల్ను కూడా ప్రకటించబోతున్నారు. ఓ డియర్ టైటిల్ అంటూ బలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. కరోనా లేకుండా ఉంటే ఈ సినిమాను ఈ ఏడాది చివరి వరకు విడుదల చేసి ఉండేవారు. కాని లాక్ డౌన్ కారణంగా షూటింగ్ జరగడం లేదు కనుక సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడ్డా అన్న మాట ప్రకారం యూవీ క్రియేషన్స్ వారు ఫస్ట్లుక్ను విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. ప్రభాస్ లుక్ ఈ చిత్రంలో ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
969568 753136Yay google is my world beater assisted me to find this fantastic website! . 613568
932112 211551hey there, your website is wonderful. I do thank you for function 224291