టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ మరియు అఖిల్ ల చిత్రాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. అఖిల్ చిత్రం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి అయ్యేది. కాని కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడినది. ఇదే సమయంలో ప్రభాస్ మూవీ కూడా ముగింపు దశకు వచ్చేది. కాని ఈ రెండు సినిమాలు కూడా మద్యలోనే ఉన్నాయి. షూటింగ్స్ కు అనుమతించిన వెంటనే ఈ రెండు సినిమాలను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
షూటింగ్ ప్రారంభం అయిన వెంటనే తమకు డేట్లు ఇవ్వాంటూ రెండు సినిమాల మేకర్స్ ఇప్పటికే పూజా హెగ్డేను విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది. జూన్ రెండవ లేదా మూడవ వారంలో ఈ రెండు సినిమాలకు పూజా హెగ్డే డేట్లు ఇవ్వాల్సి ఉంది. మరి రెండు సినిమాలకు ఒకేసారి పూజా హెగ్డే ఎలా డేట్లు ఇస్తుందో చూడాలి. రెండు సినిమాలు కూడా హైదరాబాద్ లోనే జరుగబోతున్నాయి. కనుక ఒక్క రోజులో రెండు సినిమాలకు డేట్లు అడ్జస్ట్ చేయవచ్చు అంటున్నారు.
వారంలో మూడు రోజులు ఒక సినిమాకు మరో సినిమాకు మూడు రోజులు డేట్లు ఇచ్చే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పూజా హెగ్డే కోసం ఇద్దరు హీరోల్లో ఎవరో ఒకరు వెయిట్ చేయాల్సి రావచ్చు అంటున్నారు. పూజా హెగ్డే తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో కూడా సినిమా చేస్తుంది. మరి ఆ సినిమాకు ఎలా డేట్లు ఇస్తుందో చూడాలి.
401311 858807Some truly superb articles on this internet site , thankyou for contribution. 154043
896958 457704you may have a great weblog here! would you wish to make some invite posts on my weblog? 39338
401536 391224Hi, Neat post. Theres a dilemma along with your internet site in internet explorer, would test this IE still could be the market leader and a big portion of men and women will miss your fantastic writing because of this dilemma. 67069