రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు మాట సూటిగానే వుంటుంది. అదే, ఆయన్ని ఇప్పుడు ఇరకాటంలో పడేస్తోంది. టీటీడీ భూముల వేలం వ్యవహారంపై ఘాటుగా స్పందించారు రఘురామకృష్ణంరాజు.. అది అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారిందనుకోండి.. అది వేరే విషయం.
తాజాగా, మతమార్పిడుల వ్యవహారంపై ఓ జాతీయ మీడియా ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఈ వైసీపీ ఎంపీ, రాష్ట్రంలో మత మార్పిడులు జరుగుతున్నాయని అంగీకరించారు. ‘బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయి.. దీని వెనుక డబ్బు కీలక పాత్ర పోషిస్తోంది..’ అంటూ రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ‘అయితే, ఇది ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం కాదు.. దేశంలో చాలా చోట్ల జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోనూ ఇప్పుడు కొత్తగా మొదలైన తంతు కాదు ఇది. ఎన్నో ఏళ్ళుగా జరుగుతోంది. ఈ కార్యక్రమాలతో వైఎస్ జగన్ ప్రభుత్వానికి సంబంధం వుంటుందని నేను అనుకోవడంలేదు..’ అని ఆయన సెలవిచ్చారు.
అయితే, జాతీయ మీడియా ఊరుకుంటుందా.? సీనియర్ జర్నలిస్ట్, రఘురామకృష్ణంరాజుని ఓ రేంజ్లో ఇరకాటంలో పడేశారు. ‘వేరే రాష్ట్రాల్లో జరుగుతున్నా.. అది వేరే లెక్క. ఆంధ్రప్రదేశ్లో మరీ ఓపెన్గా ఈ దందా జరుగుతోంది.. కదా.. ప్రభుత్వం తరఫున ఈ వ్యవహారంపై మీరెలా స్పందిస్తారు.? ఇది అక్రమమా.? సక్రమమా.? బలవంతపు మత మార్పిడులు నేరపూరిత చర్య అయినప్పుడు, ప్రభుత్వం ఏం చేస్తోంది.? ప్రభుత్వం అరికట్టలేకపోతోందంటే.. అది ప్రభుత్వం తాలూకు ఫెయిల్యూర్ కిందనే భావించాలి కదా..’ అంటూ నేషనల్ మీడియాకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ నుంచి ప్రశ్నల వర్షం కురిసింది.
ఈ విషయమై వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో చాలా విమర్శలు వెల్లువెత్తాయి. మళ్ళీ ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో ఆ స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.